యాప్నగరం

తాళిబొట్టు తీసేసి... నవవధువు సూసైడ్ నోట్

పెళ్లై 16 రోజులు మాత్రమే అయ్యింది. ఇంతలోనే వధువు ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి టేబుల్ పై పెట్టింది తాళి కూడా తీసేసి ఆ పక్కనే ఉంచింది.

Samayam Telugu 29 Dec 2020, 7:45 am
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలో మూడు ప్రేమజంటలు ఆత్మహత్య చేసుకున్నాయి. తాాజాగా జిల్లాలో మరో ఆత్మహత్య చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలోని వడ్లమూడి తండలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు నవ వధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. పెళ్ళైన 16 రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వధువు ఆత్మహత్యతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Samayam Telugu నవవధువు ఆత్మహత్య
bride suicide


Read More: Hyderabad: విల్లాలో రేవ్ పార్టీ.. అమ్మాయిలతో అసభ్యకరంగా డాన్సులు

వివరాల్లోకి వెెళ్తే భీమ దేవరపల్లి మండలం మాణిక్య పూర్ లో నవ వధువు రవళి (22)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ధర్మ సాగర్ మండలం నారాయణగిరికి చెందిన రవళికి 16 రోజుల క్రితమే రాజు అనే వ్యక్తితో వివాహం అయింది. అయితే తనకు పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో రవళి పేర్కొంది. రవలి తాళి బొట్టు డ్రెస్సింగ్ టేబుల్ మీదపెట్టి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.