యాప్నగరం

కొడుకు చేసిన పనికి.. తల్లిదండ్రుల ఆత్మహత్య

కొడుకు చేసిన పనికి తల్లిదండ్రులు కుమిలిపోయారు. ఇక బతకలేమని చావే శరణ్యమనుకున్నారు. ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Samayam Telugu 9 Mar 2021, 8:46 am
రోజురోజుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. కొందరు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకరమైన ఘటన వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో చోటుచేసుకుంది. కుమారుడు రూ.20 లక్షల అప్పు చేశాడనీ తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
Samayam Telugu తల్లిదండ్రుల ఆత్మహత్య


దీంతో తీవ్ర మనస్థాపం చెందిన భాస్కర్ రెడ్డి, విజయ దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.