యాప్నగరం

కానిస్టేబుల్ ప్రాణం తీసిన రోడ్డు ప్రమాదం

బైక్‌పై మహేష్ నర్సంపేటకు బయల్దేరాడు. బైక్ అదుపుతప్పడంతో అతడి తలకు బలమైన గాయం అయ్యింది. దీంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Samayam Telugu 3 Jan 2021, 11:55 am
నిత్యం రోడ్డు ప్రమాదాలతో రహదారులు నెత్తరోడుతున్నాయి. అమాయకులు ప్రాణం తీస్తున్నాయి. అతి వేగం కొందరి ప్రాణాల్ని బలితీసుకుంటుంటే.. మరికొందరి నిర్లక్ష్యం కారణంగా కూడా ఎదుటవారు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలోని నర్సంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే ఒక కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కానిస్టేబుల్ బర్ల మహేశ్ సంగేం మండలం రామచంద్రపురంకు చెందినవాడు.నర్సంపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
Samayam Telugu కానిస్టేబుల్ మహేశ్ (ఫైల్ ఫోటో)


Read More: Hyderabad Biryani: బిర్యానీలో బొద్దింక.. తిన్నవారికి షాక్

నర్సంపేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బర్ల మహేశ్ గత రాత్రి చెన్నరావు పేట నుండి నర్సంపేటకు బైక్‌పై బయల్దేరాడు. దీంతో బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయం అయింది. దీంతో కానిస్టేబుల్ మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరణించిన కానిస్టేబుల్ మహేశ్ 2013 బ్యాచ్ కు చెందినవాడు. ఇతనికి భార్య ఇద్దరు కుమార్తెలు వున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.