CM KCR: కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి కేసీఆర్ను.. ఇక్కడి మంత్రులను తిట్టి వెళ్తారు.. అలా తిట్టిన వారే ఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు తమను విమర్శిస్తున్నారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ శనివారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రి (Prathima Cancer Hospital)ని ప్రారంభించి.. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ (Telangana) ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం.. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో నేడు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. వరంగల్లో ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని 350 పడకల సామర్థ్యంతో నిర్మించారని.. ప్రతిమ వైద్య కళాశాలలో 150 మెడికల్ ఎంబీబీఎస్ (MBBS) సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ప్రజలకు ఏ విషయం అయితే పదేపదే చెప్పానో.. అది వందకు వంద శాతం ఇవాళ సాకారం అవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధనిక రాష్ట్రంగా ఉంటామని ఉద్యమ సమయంలో తాను చెప్పానని గుర్తు చేశారు. రూ.1100 కోట్ల వ్యయంతో పాత సెంట్రల్ జైల్ ప్రాంతంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (Super Specialty Hospital) పనులను ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పరిశీలించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ప్రజలకు ఏ విషయం అయితే పదేపదే చెప్పానో.. అది వందకు వంద శాతం ఇవాళ సాకారం అవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధనిక రాష్ట్రంగా ఉంటామని ఉద్యమ సమయంలో తాను చెప్పానని గుర్తు చేశారు. రూ.1100 కోట్ల వ్యయంతో పాత సెంట్రల్ జైల్ ప్రాంతంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (Super Specialty Hospital) పనులను ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పరిశీలించారు.