యాప్నగరం

CM KCR: గల్లీలో విమర్శిస్తున్నారు.. ఢిల్లీలో అవార్డులిస్తున్నారు: కేసీఆర్

CM KCR: ఎన్టీయే ప్రభుత్వం, కేంద్ర మంత్రులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చి ఇక్కడి ప్రభుత్వాన్ని తిట్టి.. మళ్లీ ఢిల్లీకి వెళ్లి అదే తెలంగాణకు అవార్డులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. శనివారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 1 Oct 2022, 3:09 pm

ప్రధానాంశాలు:

  • వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
  • ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించిన కేసీఆర్
  • ఎన్డీయే సర్కారుపై విమర్శలు గుప్పించిన కేసీఆర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu KCR speaking in the meeting
సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్
CM KCR: కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి కేసీఆర్‌ను.. ఇక్కడి మంత్రులను తిట్టి వెళ్తారు.. అలా తిట్టిన వారే ఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో భాగంగానే కేంద్ర మంత్రులు తమను విమర్శిస్తున్నారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ శనివారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రి (Prathima Cancer Hospital)ని ప్రారంభించి.. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
తెలంగాణ (Telangana) ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం.. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో నేడు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేశారు. వరంగల్‌లో ప్రతిమ క్యాన్సర్‌ ఆస్పత్రిని 350 పడకల సామర్థ్యంతో నిర్మించారని.. ప్రతిమ వైద్య కళాశాలలో 150 మెడికల్‌ ఎంబీబీఎస్‌ (MBBS) సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ప్రజలకు ఏ విషయం అయితే పదేపదే చెప్పానో.. అది వందకు వంద శాతం ఇవాళ సాకారం అవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ధనిక రాష్ట్రంగా ఉంటామని ఉద్యమ సమయంలో తాను చెప్పానని గుర్తు చేశారు. రూ.1100 కోట్ల వ్యయంతో పాత సెంట్రల్ జైల్ ప్రాంతంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (Super Specialty Hospital) పనులను ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పరిశీలించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.