యాప్నగరం

Rythu Sangharshana Sabha:రైతు కుటుంబాలకు రాహుల్ గాంధీ పరామర్శ

రైతు సంఘర్షణ సభ పేరిట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 6 May 2022, 7:16 pm
వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరుగతున్న రైతు ‘సంఘర్షణ సభ’కు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వరంగల్ చేరుకున్న రాహుల్‌ అక్కడి వాహనంలో సభావేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సభా ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబసభ్యులను రాహుల్ పరామర్శించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతు కుటుంబాల సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబసభ్యులను ఓదార్చిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.