యాప్నగరం

తట్ట అల్లిన ఎమ్మెల్యే రాజయ్య

ఇప్పటికే తన నియోజకవర్గ ప్రజల కోసం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య మెడికల్ ప్యాకేజీ ప్రకటించారు. తాజాగా ఆయన పలు మండలాల్లో పర్యటించి ప్రజలను అప్యాయంగా పలకరించారు.

Samayam Telugu 23 Feb 2021, 11:00 am
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ టీ రాజయ్య టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం మెడికల్‌ ప్యాకేజీ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదులో భాగంగా సోమవారం ఆయన జఫర్‌గఢ్‌ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. పలువురికి టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలను అందజేశారు.
Samayam Telugu తట్ట అల్లుతున్న ఎమ్మెల్యే రాజయ్య


ఈ క్రమంలో సాగరం గ్రామంలో ఎరుకల కుల వృత్తిలో భాగంగా తట్ట అల్లుతున్న తిరుపతి ఎల్లమ్మను ఆప్యాయంగా పలకరించారు రాజయ్య. ఆమె కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్లమ్మ అల్లుతున్న తట్టను తీసుకుని ఎమ్మెల్యే స్వయంగా అల్లారు. కార్యకర్తల్లో జోష్‌ నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజకవర్గంలో 50 వేల సభ్యత్వాలు పూర్తి చేసినట్లు తెలిపా రు. మార్చి 2న తన పుట్టిన రోజు సందర్భంగా ఆసుపత్రిలో నియోజకవర్గ ప్రజలకు రాయితీలు ప్రకటించే కార్యాచరణను అమలు చేస్తానని తెలిపారు ఎమ్మెల్యే రాజయ్య.

ఇటీవలే డప్పు కొట్టి చిందులు వేశారు ఎమ్మెల్యే రాజయ్య. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ... ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ అధ్యక్షతన మాదిగల జాగృతి రథయాత్రను ప్రారంభించారు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.