యాప్నగరం

Teenmar Mallanna: ఆరెపల్లిలో ఉద్రిక్తత.. తీన్మార్ మల్లన్న అరెస్టు

Hanamkonda: హనుమకొండ జిల్లాలోని ఆరెపల్లిలో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన యాక్టివిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Authored byRaj Kumar | Samayam Telugu 29 May 2022, 8:29 am
హనుమకొండ జిల్లాలోని ఆరెపల్లిలో భూసేకరణ జీవో 80ఏను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.‌ రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.‌ అరెస్టును అడ్డుకునేందుకు రైతులు, వారి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.‌ గ్రామసభ నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
Samayam Telugu teenmar mallanna arrest


ఈ క్రమంలోనే పోలీసులు రైతులను నెట్టేసి, తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి వేలేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే సాయంత్రం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టినట్లు తెలిసింది. అయితే జీఓ 80ను వ్యతిరేకంగా ఆరెపల్లిలో రైతులు పోచమ్మ ఆలయం వద్ద గ్రామ సభ నిర్వహించగా వారికి మద్దతుగా వెళితే అరెస్టు చేయడంతో పాటు అక్రమ కేసు నమోదు చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు.

కేసులకు భయపడేది లేదని, ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన జీవో 80ఏ ను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతానని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. గ్రామంలో ప్రశాంతంగా గ్రామ సభ పెట్టుకుంటే పోలీసులు వచ్చి సభను భగ్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత మందిని అరెస్ట్‌ చేసిన ఉద్యమం ఆగదని, భూసేకరణ జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.