యాప్నగరం

Telangana DGP: టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై భగ్గుమన్న బండి.. డీజీపీకి డెడ్‌లైన్

తన పాదయాత్రలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతలు చేసిన దాడిపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ డెడ్‌లైన్ విధించారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 15 Aug 2022, 4:40 pm
జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ కార్యకర్తల రాళ్లదాడి ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిన ఆయన... బీజేపీ కార్యకర్తల తలలు పగలగొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. తన పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే తర్వాత జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
Samayam Telugu డీజీపీతో ఫోన్లో మాట్లాడుతున్న బండి సంజయ్

Bandi Sanjay పాదయాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తల రాళ్లదాడి.. జనగామలో ఉద్రిక్తత
టీఆర్ఎస్ కార్యకర్తల రాళ్లదాడిలో బీజేపీ కార్యకర్తలకు ఇద్దరికి తలలు పగిలాయని బండి సంజయ్ డీజీపీకి వివరించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించకపోతే గాయపడ్డ కార్యకర్తలను 10 నిమిషాల్లో డీజీపీ ఆఫీసుకి తీసుకొస్తానని.. ముఖ్యమంత్రిని అక్కడికే రమ్మనండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పోలీసులు కల్పించే భద్రత వద్దని.. కార్యకర్తలే తనను చూసుకుంటారని బండి సంజయ్ అన్నారు. కొందరు పోలీసులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఆరోపించారు. తాము ఎంతో ప్రశాంతంగా పాదయాత్ర కొనసాగిస్తుంటే టీఆర్ఎస్ నేతలు కావాలనే రెచ్చగొట్టి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.