యాప్నగరం

Thakkallapally Ramu: వరంగల్ జిల్లాలో విషాదం.. గుండెపోటుతో మాజీ మంత్రి తనయుడి మృతి

వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తంరావు కుమారుడు, తెలంగాణ జనవేదిక కన్వీనర్ తక్కెళ్లపల్లి రాము గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు

Samayam Telugu 18 Sep 2022, 10:58 am
వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. మాజీ మంత్రి త‌క్కెళ్లప‌ల్లి పురుషోత్తంరావు(Thakkalapally Purushothama Rao) కుమారుడు, తెలంగాణ జ‌న‌వేదిక క‌న్వీన‌ర్ రాము(Thakkalapally Ramu) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో క‌న్నుమూశారు. తెలంగాణ జ‌న‌వేదిక సంస్థకు క‌న్వీన‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్న ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందారు.
Samayam Telugu తక్కెళ్లపల్లి రాము


తెలంగాణ జ‌న‌వేదిక రాముగా ఓరుగ‌ల్లు ప్రజ‌ల‌కు తక్కెళ్లపల్లి రాము సుప‌రిచితుడు. బోధించు, స‌మీక‌రించు, ఉద్యమించు అనే నినాదంతో వ‌ర్తమాన రాజ‌కీయ‌, సామాజిక‌, దేశ అభివృద్ధి అంశాల‌పై ఆయా రంగాల‌కు చెందిన ప్రముఖుల‌తో తెలంగాణ జ‌న‌వేదిక ఆధ్వర్యంలో రాము స‌ద‌స్సులు నిర్వహించేవారు. క‌రోనా కారణంతో ప్రతి ఆదివారం సాయంత్రం జూమ్ వేదిక‌గా ఆన్‌లైన్ సదస్సులు కొనసాగిస్తూ ఉండేవారు.

స‌మాజంపై ఎంతో బాధ్యతాయుతంగా వ్యవ‌హ‌రించే రాము సుప‌రిపాల‌న దిశ‌గా చేయాల్సిన కృషిని, ప్రజలు, ప్రభుత్వాల బాధ్యత‌ను స‌ద‌స్సుల ద్వారా మేధావి వ‌ర్గం ఆలోచ‌న‌ల‌ను జ‌నంలోకి బాగా తీసుకెళ్లగలిగేవారు. మాజీ మంత్రి త‌క్కెళ్లప‌ల్లి పురుషోత్తంరావు త‌న‌యుడైన రాము అన్ని పార్టీల నేతలు, ప్రజాసంఘాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఆయన గుండెపోటుతో మరణించారన్న వార్త తెలుసుకుని వరంగల్ ప్రజలు, మేధావి వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.