యాప్నగరం

జనగామ: ఈయనేం అధికారి.. జాతీయగీతం కూడా రాదా!

రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా జనగామ జిల్లా తరిగొప్పుల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఓ అధికారి సెల్‌ఫోన్ చూస్తూ జాతీయ గీతాలాపన చేయడం విమర్శలకు దారితీసింది.

Samayam Telugu 26 Jan 2021, 2:45 pm
ఆయనో మండలాధికారి. కానీ ఆయనకు జాతీయగీతం పాడటం రాదు. రిప్లబిక్‌ డే రోజు తన సెల్‌ఫోన్లో చూస్తూ జాతీయగీతం పాడుతూ అందరి కంట పడ్డారు. జనగామ జిల్లాలో జరిగిన ఘటన ఉదయం నుంచి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జనగామ జిల్లా తరిగొప్పుల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో ఇంద్రసేనారెడ్డి పతాకావిష్కరణ చేశారు. జెండా వందనం చేశాక అందరూ జాతీయగీతం పాడటం మొదలుపెట్టారు.
Samayam Telugu సెల్‌ఫోన్లో చూసి జాతీయ గీతాలాపన చేస్తున్న అధికారి


ఆ వేడుకల్లో పాల్గొన్న ఓ అధికారి మాత్రం తన సెల్‌ఫోన్లో చూసుకుంటూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయన తీరు చూసి అతిథులు, ప్రజాప్రతినిధులు అవాక్కైనా ఎవరూ స్పందించలేదు. అయితే ఈ ఘటనను ఫోటోలు తీసిన కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన అధికారే జాతీయ గీతాన్ని ఫోన్లో చూసి పాడటం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.