యాప్నగరం

Congress Rythu Declaration:అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ: రేవంత్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 6 May 2022, 9:34 pm
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ అంటే పేగు బంధం.. ఆత్మగౌరవం అని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. రైతుల పక్షాన పోరాడే విషయంపై కాంగ్రెస్ సంపూర్ణ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 2023లో తెలంగాణలో సోనియమ్మ రాజ్యం వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరుగుతున్న ‘రైతు సంఘర్షణ’ సభలో ప్రసంగించిన ఆయన రైతు డిక్లరేషన్‌ని ప్రకటించారు. ఈ సందర్భంగా రైతు డిక్లరేషన్‌లోని అంశాలను ఆయన వివరించారు.
Samayam Telugu రైతు డిక్లరేషన్ ప్రకటిస్తున్న రేవంత్ రెడ్డి



డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు
* కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంగా రూ.2లక్షల రుణమాఫీ
* కౌలు రైతులకు ప్రతి ఎకరాలకు రూ.15వేల ఆర్థిక సాయం
* రైతు కూలీలకు ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం
* పసుపు బోర్డు ఏర్పాటు
* ధరణి పోర్టల్ రద్దు
* సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు్ల
*నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు
* రైతు కమిషన్ ఏర్పాటు

రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.