తెలంగాణ ప్రజలపై కేంద్రంలోని బీజేపీ వివక్ష చూపుతోందని.. ఇక్కడ ప్రజల జోలికొస్తే మసై పోతారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ వేస్తూ.. తెలంగాణపై బీజేపీ కపట ప్రేమ చూపిస్తోందంటూ మండిపడ్డారు. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాయొద్దంటూ హెచ్చరించారు. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా భాగమేనని.. దాన్ని వేరు చేసి చూడొద్దంటూ ఆరూరి కామెంట్స్ చేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కిషన్ రెడ్డి చెప్పటం సిగ్గు చేటంటూ ప్రభుత్వం చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తే కిషన్ రెడ్డి విదేశాలకు పారిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అవసరమైతే బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కుపై మరో ఉద్యమం చేస్తామని.. ఓరుగల్లు పోరుగల్లుగా మారుతుందని హెచ్చరించారు.
తెలంగాణ జోలికొస్తే మసై పోతరు.. కిషన్రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్
తెలంగాణ ప్రజలపై కేంద్రంలోని బీజేపీ వివక్ష చూపుతోందని.. ఇక్కడ ప్రజల జోలికొస్తే మసై పోతారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ వేస్తూ.. తెలంగాణపై బీజేపీ కపట ప్రేమ చూపిస్తోందంటూ మండిపడ్డారు. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాయొద్దంటూ హెచ్చరించారు. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా భాగమేనని.. దాన్ని వేరు చేసి చూడొద్దంటూ ఆరూరి కామెంట్స్ చేశారు.
ప్రధానాంశాలు:
- బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదా కిషన్ రెడ్డి
- విభజన చట్టంలో పొందుపరిచిన వాటిని నెరవేర్చాలి
- తెలంగాణను వేరు చేసి చూడొద్దు: ఎమ్మెల్యే ఆరూరి రమేశ్