యాప్నగరం

ఎదురుగా దూసుకొచ్చిన కారు.. బైక్‌పై తల్లీకొడుకులు.. విషాదం

అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో తల్లీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 8 Jan 2021, 7:02 pm
పెద్దపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు బైక్‌ని ఢీకొట్టడంతో తల్లీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. మంథని మండలం బట్టుపల్లి వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. నాగపల్లి గ్రామానికి చెందిన నాగరాజు(23) తల్లి రాజేశ్వరి(50)తో కలసి బైక్‌పై మంధని వైపు వెళుతున్నాడు. నాగపల్లి సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వేగంగా వచ్చిన కారు బైక్‌ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీకొడుకులు స్పాట్‌లోనే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.