యాప్నగరం

ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు హాజరై.. తిరుగు ప్రయాణంలో... తిరిగిరాని లోకాలకు..

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని తిరిగొస్తున్న ఇద్దరు మిత్రులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బైక్ చెట్టును ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.

Samayam Telugu 1 Jan 2021, 8:44 am
న్యూ ఇయర్ వేళ వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సరాదికి.. మిత్రుడి పుట్టిన రోజు కూడా తోడవడంతో.. ఫ్రెండ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొని వస్తుండగా.. ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. జనవరి 1న తెల్లవారుజామున వర్ధన్నపేట సమీపంలోని నీలగిరిస్వామి తండాలో చోటు చేసుకుంది.
Samayam Telugu accident56
Representative image


వర్ధన్నపేటలోని స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు అతడి స్నేహితులు ఐత శ్రీకాంత్ (20), శ్రీశాంత్ (18)లతోపాటు రేవంత్ అనే బాలుడు హాజరయ్యారు. తర్వాత రాయపర్తి తిరిగొస్తుండగా.. వీరి బైక్ అదుపు తప్పి చెట్టను ఢీకొట్టింది. శ్రీకాంత్, శ్రీశాంత్ ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. రేవంత్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.