యాప్నగరం

జనగాంలో అస్థిపంజరాల కలకలం.. మనుషులా? కోతులా?

పండుగకి పతంగులు ఎగరేసుకుంటూ చిన్నారులు నర్సరీలోని వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లారు. అక్కడ దుర్వాసన వస్తుండడంతో స్థానికులకు చెప్పారు. ఆ ట్యాంక్‌లో రెండు అస్థిపంజరాలు ఉండడం కలకలం రేపింది.

Samayam Telugu 17 Jan 2021, 7:04 pm
వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కనిపించడం జనగామ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆడుకుంటూ పాడుబడిన ట్యాంకు వద్దకు వెళ్లిన చిన్నారులకు దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ట్యాంకులో ఉన్నవి ఇద్దరు చిన్నారుల అస్థిపంజరాలని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తోంటే.. పోలీసులు మాత్రం కోతులవి అయి ఉండొచ్చని చెప్పడం కొసమెరుపు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
skelton


నర్మెట మండల కేంద్రం నుంచి జనగామ వెళ్లే రహదారిలో గతంలో ఓ నర్సరీ ఉండేది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ నర్సరీలో నీటి అవసరాల కోసం వాటర్ ట్యాంకు నిర్మించారు. కొద్దికాలంగా నర్సరీ నిర్వహణ లేకపోవడంతో వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగరేస్తై వాటర్ ట్యాంకు వైపు వెళ్లిన చిన్నారులకు దుర్వాసన రావడంతో స్థానికులకు తెలియజేశారు.

ట్యాంకులో అస్థిపంజరాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాటర్ ట్యాంకులోని అస్థిపంజరాలను పరిశీలించారు. ఇద్దరు చిన్నారులను చంపేసి ట్యాంకులో పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. ట్యాంకు బాగా ఎత్తుగా ఉండడంతో కోతులు ప్రమాదవశాత్తూ పడిపోయి బయటికి రాలేక చనిపోయి ఉంటాయని భావిస్తున్నామన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.