యాప్నగరం

ఆగి ఉన్న లారీని ఎత్తుకెళ్లిన దుండగులు

లారీలో నిద్రపోతున్న డ్రైవర్, క్లీనర్‌ను బెదిరించారు. మద్యం మత్తులో ఉన్న ఐదుగురు లారీని దొంగలించి ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు లారీ డ్రైవర్ ఫిర్యాదు చేశాడు.

Samayam Telugu 15 Jul 2021, 12:07 pm
దొంగతనానికి కాదేది అనర్హమని కొందరు దుండగులు రెచ్చిపోతున్నారు. కారులు, బైకులే కాదు.. ఇప్పుడు లారీలు కూడా ఎత్తుకుపోతున్నారు. తాజాగా జయశంకర్ భూాపాలపల్లి జిల్లాలో ఆగి ఉన్న లారీని ఎత్తుకెళ్లారు. రేగొండ చెక్ పోస్టు వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారీని దుండగులు తీసుకెళ్లిపోయారు. కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నారు. లారీలో నిద్రపోతున్న డ్రైవర్, క్లినర్‌పై ఒక్కసారిగా దాడి చేశారు.
Samayam Telugu unknown person theft lorry at jayashankar bhupalpally district
ఆగి ఉన్న లారీని ఎత్తుకెళ్లిన దుండగులు


బయటకు అరుపులు పెడితే చంపేస్తామని బెదిరించి లారీతో పరారయ్యారు. లారీ డ్రైవర్, క్లినర్ సెల్ ఫోన్లు తీసుకుని వారిని కారులో ఎక్కించుకుని, అరిస్తే చంపేస్తామని బెదిరించి.. గుడెప్పడ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.