యాప్నగరం

పోలీస్ స్టేషన్ ముందే సొంత ఆటోకు నిప్పు.. తగలబెట్టుకున్న యువకుడు

Parakala: వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

Samayam Telugu 22 Jan 2021, 3:13 pm
ఓ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఓ వ్యక్తి తన ఆటోకు నిప్పంటించుకున్నాడు. పోలీసులపై అలిగి పోలీస్ స్టేషన్ ముందే ఈ అతను ఈ పని చేయడం గమనించదగ్గ విషయం. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో జరిగింది. కొద్ది రోజులుగా తాను ఎదుర్కొంటున్న సమస్యను పోలీసులకు వివరిస్తే వారు పట్టించుకోలేదని ఆ వ్యక్తి ఆరోపించారు. పదే పదే పోలీసులను అడిగినా వారు పట్టనట్లు వ్యవహరించారని వాపోయారు.
Samayam Telugu ఆటోను తగలబెట్టుకున్న యువకుడు
auto fire in parakala


వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది నెలల క్రితం ఆటో కొనుక్కొనేందుకు ఫైనాన్షియర్ల వద్ద డబ్బులు అప్పు తీసుకున్నాడు. అయితే, కరోనా మహమ్మారి ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. లాక్‌డౌన్ వల్ల అంతా ఇంట్లోనే ఉండిపోవడంతో ఇల్లు గడవడం అతనికి కష్టమైంది. ఈ క్రమంలో ఆ ఆటోకు తీసుకున్న అప్పు నెల నెలా ఈఎంఐ కట్టడంలో ప్రవీణ్ విఫలమయ్యారు.

గిరాకీల్లేక కిస్తీలు కట్టడం ఆలస్యం కావడంతో ఫైనాన్సియర్లు తీవ్ర స్థాయిలో తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన అన్నారు. వారి వేధింపులు భరించలేక ప్రవీణ్ పరకాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేయగానే ఫైనాన్సియర్ల వేధింపులు మరింతగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదనే కోపంతో ప్రవీణ్ పరకాల పోలీస్ స్టేషన్ ఎదుట తన ఆటోకు నిప్పంటించుకొని నిరసన తెలిపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.