యాప్నగరం

Sankranti 2021: వరంగల్‌లో కోడి పందేలు.. నలుగురు అరెస్టు

Warangal: వరంగల్‌ జిల్లాలో కోడిపందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కోడి పందేల ఘటన హసన్‌పర్తి పరిధిలోని జయగిరి గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది.

Samayam Telugu 14 Jan 2021, 8:03 pm
సంక్రాంతికి ప్రధానంగా అందరికి గుర్తుకు వచ్చేవి కోడి పందేలు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలో ఎక్కువగా జరుగుతుంటాయి. తెలంగాణలో చాలా తక్కువగా కోడి పందేలను చూడొచ్చు. అయితే, వరంగల్‌లోనూ కోడి పందేలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వరంగల్‌ జిల్లాలో కోడిపందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కోడి పందేల ఘటన హసన్‌పర్తి పరిధిలోని జయగిరి గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
warangal police


కోడి పందేలు నిర్వహిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్‌‌ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్‌లు బి.నందిరామ్‌, మధు తమ కానిస్టేబుళ్లతో కలిసి దాడి నిర్వహించారు. పందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి నాలుగు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.3,260 సొమ్ము, వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన నిందితులు దేవరకొండ రాములు, దేవరకొండ భిక్షపతి, యాకూబ్‌ పాషా, ఓని సుధాకర్‌, సయ్యద్‌ మౌలాలీ అని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.