యాప్నగరం

చుట్టతో సజీవ దహనం!! మంటల్లో కాలిపోయిన మహిళ.. షాకింగ్ ఘటన

రోజూ చుట్ట తాగే మహిళ ఆ చుట్టకే బలైపోయింది. ఒళ్లంతా కాలిపోయిన గాయాలతో ఆస్పత్రిపాలై ప్రాణాలు విడిచింది. ఈ ఘటన హన్మకొండలో జరిగింది.

Samayam Telugu 19 Jan 2021, 3:21 pm
చుట్ట అలవాటు ఓ మహిళ నిండుప్రాణాలను బలితీసుకుంది. మంటల్లో కాల్చి బుగ్గిచేసింది. ఒళ్లంతా తగలబడిపోయి తీవ్రగాయాలతో పోరాడి ఓడిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ షాకింగ్ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హన్మకొండలోని వెంకట్రామ కాలనీ, గోకుల్‌నగర్‌కి చెందిన చింతాడి రామలక్ష్మి(60) పొగాకు అలవాటు ఉంది. రోజూ చుట్ట కాల్చుకునేది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
cigar


ఈనెల 13 వ తేదీన చుట్ట కాలుస్తుండగా ప్రమాదవశాత్తూ నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. అవి చీరకు అంటుకోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో రామలక్ష్మి ఒళ్లంతా కాలిపోయి తీవ్రగాయాలపాలైంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి మంటలను ఆర్పివేసి ఆస్పత్రికి తరలించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతూ నిన్న ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతురాలి కూతురి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.