యాప్నగరం

ప్రేమపేరుతో కానిస్టేబుల్ వేధింపులు.. మహిళా ఉద్యోగి ఆత్మహత్య

కానిస్టేబుల్ సర్వేష్ కొద్దికాలంగా మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రేమించమంటూ వెంటపడేవాడని తెలుస్తోంది. అతని వేధింపులు భరించలేక సంగీత ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 19 Apr 2022, 9:34 pm
హన్మకొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కంచే చేను మేసిన చందంగా ప్రవర్తించాడో కానిస్టేబుల్. వేధింపుల నుంచి ఆడబిడ్డలను రక్షించాల్సిందిపోయి తానే కీచకుడిగా మారాడు. తనను ప్రేమించాలంటూ మహిళా ఉద్యోగిని వేధించాడు. భరించలేకపోయిన ఉద్యోగిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. శాయంపేట మండలం మాందారిపేటలో ఈ ఘోరం జరిగింది. సంగీత అనే ఉద్యోగినిని కానిస్టేబుల్ సర్వేష్ యాదవ్ ప్రేమించమంటూ కొద్దికాలంగా వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించినా ఆమె వెంటపడి వేధింపులకు గురిచేసేవాడని తెలుస్తోంది.
Samayam Telugu girl death


ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేకపోయిన సంగీత ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు సర్వేష్‌ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానిస్టేబుల్‌ని కఠినంగా శిక్షించాలంటూ మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.