యాప్నగరం

ఐటీ సిటీగా వరంగల్.. కానీ.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల వరంగల్ నేతలతో సమావేశమయ్యారు. వరంగల్ సిటీ, జిల్లాలోని ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ బతికి ఉండుంటే నగరం దూసుకుపోయేదని ఆమె వ్యాఖ్యానించారు.

Samayam Telugu 10 Mar 2021, 2:00 pm

ప్రధానాంశాలు:

  • సాంస్కృతిక రాజధాని వరంగల్
  • ఐటీ సిటీగా చేద్దామనుకున్నారు..
  • వైఎష్ షర్మిల షాకింగ్ కామెంట్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
sharmila
రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులేస్తోన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల.. వైఎస్ అభిమానులతో సమావేశమవుతున్నారు. నల్గొండ జిల్లా వైఎస్ అభిమానులు, నేతలతో ప్రారంభమైన సమావేశాలు జిల్లాలవారీగా కొనసాగుతున్నాయి. ఈ రోజు వరంగల్ జిల్లాకు చెందిన నేతలతో సమావేశమైన షర్మిల మాట్లాడారు. ఏకశిలా నగరంగా పేరుగాంచిన వరంగల్.. సాంస్కృతిక రాజధాని అని ఆమె అన్నారు. రాణి రుద్రమ పుట్టిన గడ్డ అని కొనియాడారు. ఎందరో ఉద్యమకారులు, కళాకారులు, కవులను అందించిన జిల్లా అని ప్రశంసించారు.
తన తండ్రి వైఎస్‌ను గుర్తుచేస్తూ వైఎష్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సిటీని ఐటీ సిటీగా తీర్చిదిద్దాలని వైఎస్ అభిలషించారని.. కానీ అలా జరగలేదన్నారు. వైఎస్ బతికి ఉండుంటే వరంగల్ అభివృద్ధిలో దూసుకుపోయేదని ఆమె వ్యాఖ్యానించారు. జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 80 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్‌దేనని ఆమె అన్నారు. కానీ దికంతన్‌పల్లె ప్రాజెక్టు పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. రాజన్న బిడ్డకు వరంగల్ అభిమానులు, నేతల సలహాలు, సూచనలు అవసరమన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.