YS Sharmila: అన్నపై మొదటిసారి షర్మిల కామెంట్లు.. దేనికి సంకేతం..?
YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మొదటిసారి తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మొదటిసారిగా బహిరంగంగా కామెంట్లు చేశారు. ఇన్ని రోజులు ఎడ మొహం పెడ మొహంగా ఉన్న అన్నాచెళ్లెల్లు.. వాళ్లపై వచ్చిన వార్తలకు ఒక్కసారి కూడా స్పందించలేదు. అలాంటిది.. మొదటిసారి జగన్పై షర్మిల ఓపెన్ అయ్యింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల.. తెలంగాణ ప్రభుత్వంపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేపథ్యంలో.. ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్పై షర్మిల ఆసక్తికర కామెంట్లు చేశారు.
YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన అన్న, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుంత ఢిల్లీ (Delhi) లో పర్యటిస్తున్న షర్మిల.. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని సీబీఐ (CBI) అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని వినతి పత్రం అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పేరుతో మేఘా కంపెనీతో కలిసి రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. అయితే.. ఇందుకు సంబంధించిన ప్రెస్ మీట్లో ఓ వార్తా సంస్థకు చెందిన రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తన అన్నపై ఆసక్తికర కామెంట్లు చేశారు షర్మిల. అయితే.. తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నుంచే జగన్కు షర్మిల కాస్త దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని.. ఆ మధ్య వార్తలు తెగ ప్రచారమయ్యాయి. కానీ.. ఆ వార్తలపై అన్నాచెళ్లుల్లు మాత్రం స్పందించలేదు. షర్మిల మాత్రం అప్పుడప్పుడు పరోక్షంగా జగన్ మీద విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. కానీ.. ఇప్పుడు మాత్రం నేరుగానే స్టేట్మెంట్లు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.
భవిష్యత్తులో ఏపీ సీఎం జగన్ మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశముందా అని సదరు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షర్మిల ఇచ్చిన సమాధానం చర్చకు దారి తీస్తోంది. తాను తెలంగాణలో పార్టీ పెట్టింది.. పాలనలో మార్పు తేవడం కోసంమని షర్మిల తెలిపారు. తన గురించి తాను గొప్పలు చెప్పకుంటే బాగోదన్న షర్మిల... ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుందని వివరించారు. అన్నకు చెల్లిగా తాను చేయాలనుకుంది.. చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశానని తెలిపారు. శక్తికి మించే సాయం చేశానన్నారు. తాను చేశాను కదా.. అని తిరిగి వాళ్లు తనకు చేయాలనుకోవడం కూడా స్వార్థం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అవినీతితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏపీలో అవినీతి గురించి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు మాట్లాడాలన్నారు. తనకు ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
గతంలో ఎప్పుడూ జగన్పై నేరుగా విమర్శలు చేయని షర్మిల.. మొదటి సారి ఏపీ రాజకీయాలపై కానీ.. తన అన్న జగన్పై కానీ నేరుగా కామెంట్లు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందనన్నది కొందరి అభిప్రాయం. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొన్నా.. అన్నా చెళ్లెల్లు ఎడ ముఖం పెడ ముఖంగానే ఉంటూ కనిపించారు. కనీసం ముఖాలు చూసకుని నవ్వినట్టు కూడా ఎవరికి కనిపించలేదు. పైగా.. ఇన్ని రోజులు ఎలాంటి వార్తలకు స్పందించన షర్మిల ఇప్పుడు ఢిల్లీలో.. మీడియా ముందు ఓపెనవ్వటంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
భవిష్యత్తులో ఏపీ సీఎం జగన్ మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశముందా అని సదరు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షర్మిల ఇచ్చిన సమాధానం చర్చకు దారి తీస్తోంది. తాను తెలంగాణలో పార్టీ పెట్టింది.. పాలనలో మార్పు తేవడం కోసంమని షర్మిల తెలిపారు. తన గురించి తాను గొప్పలు చెప్పకుంటే బాగోదన్న షర్మిల... ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుందని వివరించారు. అన్నకు చెల్లిగా తాను చేయాలనుకుంది.. చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశానని తెలిపారు. శక్తికి మించే సాయం చేశానన్నారు. తాను చేశాను కదా.. అని తిరిగి వాళ్లు తనకు చేయాలనుకోవడం కూడా స్వార్థం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అవినీతితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏపీలో అవినీతి గురించి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు మాట్లాడాలన్నారు. తనకు ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
గతంలో ఎప్పుడూ జగన్పై నేరుగా విమర్శలు చేయని షర్మిల.. మొదటి సారి ఏపీ రాజకీయాలపై కానీ.. తన అన్న జగన్పై కానీ నేరుగా కామెంట్లు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందనన్నది కొందరి అభిప్రాయం. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొన్నా.. అన్నా చెళ్లెల్లు ఎడ ముఖం పెడ ముఖంగానే ఉంటూ కనిపించారు. కనీసం ముఖాలు చూసకుని నవ్వినట్టు కూడా ఎవరికి కనిపించలేదు. పైగా.. ఇన్ని రోజులు ఎలాంటి వార్తలకు స్పందించన షర్మిల ఇప్పుడు ఢిల్లీలో.. మీడియా ముందు ఓపెనవ్వటంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
- Read More Telangana News and Telugu News