యాప్నగరం

హ్యూమర్: పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ రిటైర్ మెంట్ వాయిదా

వచ్చే నెలలో రిటైర్ కావాల్సిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ తన రిటైర్ మెంట్ ను మరో రెండేళ్లకు పైగానే వాయిదా వేసుకున్నాడంట.

TNN 4 Oct 2016, 3:12 am
వచ్చే నెలలో రిటైర్ కావాల్సిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ తన రిటైర్ మెంట్ ను మరో రెండేళ్లకు పైగానే వాయిదా వేసుకున్నాడంట. భారత సైన్యం ఇటీవల జరిపిన సర్జికల్ దాడుల వల్ల రహీల్ ఈ నిర్ణయం తీసుకున్నాడంట. "గత కొన్ని రోజులుగా వృత్తిపరంగా నిజాయితీ ఉండడం నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది. ఇక నా టెర్రరిజం విధానాలను, బాంబ్ బ్లాస్ట్ లను చూపించాలనుకుంటున్నాను. ఒక రెండు సంవత్సరాల వరకు బాగా క్వాలిటీ టెర్రర్ అటాక్స్ నిర్వహించాలనుకుంటు న్నాను." అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. "నేను మంచి మంచి ప్రణాళికలు రూపొందిస్తాను. బాంబ్ బ్లాస్ట్ లు చేసి సామాన్య జనాన్ని చంపుతా. ఈ విషయంలో నేను ఆలోచించే ప్రసక్తే లేదు." అని అన్నాడు. అలాగే షరీఫ్ రిపోర్టింగ్ మేనేజర్ అయిన హఫీజ్‌ సయీద్‌ కూడా రహీల్ ప్లేస్ లో ఇంకొకరు నియమితులు కావడానికి ఇష్టపడడం లేదంట. "రెండేళ్ల క్రితం నన్ను ఆర్మీ చీఫ్ నియమంచినప్పుడు హఫీజ్ సాహిబ్(26/11 ముంబై దాడుల సూత్రధారి, జైషే మహ్మద్‌ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌) నాపై ఎంతో నమ్మకం ఉంచాడు. అతను నా సామర్ధ్యాలను నమ్మాడు. అలాగే అతని వద్ద ఉన్న బాగా టాలెంట్ కలిగిన ముజాహిదీన్, ఫిదాయిన్ టీమ్ లను నాకు అప్పగించాడు. అయితే పఠాన్ కోట్ దాడులలో మాపై అతను పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చేశాం. ఇక ఈ సారి గతంలో జరిగిన 26/11 దాడుల మాదిరిగా నిర్వహించాలని నేను అనుకుంటున్నాను." అని రహీల్ తన మనస్సులోని మాట చెప్పారు. రహీల్ తన రిటైర్ మెంట్ ను వాయిదా వేసుకున్న తర్వాత మొదట చేపట్టబోయే పని ఇండియాపై న్యూక్లియర్ అటాక్ నిర్వహించడమేనట. ఈ దాడి జరుగుతున్నప్పుడు ఆ యుద్ధాన్ని చిత్రీకరించేందుకు ఫొటోలు, వీడియో లు తీయడంలో ఎక్స్ ఫర్ట్ లు అయిన ఒక టీమ్ ను రహీల్ నియమించుకుంటున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Samayam Telugu humour gen raheel sharif postpones his retirement says has 2 more years of terror attacks left in him
హ్యూమర్: పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ రిటైర్ మెంట్ వాయిదా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.