యాప్నగరం

మాక్‌టేల్: నా కేసుని నేనే విచారించుకుంటా -దావూద్ ఇబ్రహీం

పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై పాకిస్థాన్‌కి చెందిన తీవ్రవాదులు దాడులకి పాల్పడటం... ఇదే అంశంపై ప్రస్తుతం పాక్ నుంచి

Samayam Telugu 7 Apr 2016, 5:07 pm
పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై పాకిస్థాన్‌కి చెందిన తీవ్రవాదులు దాడులకి పాల్పడటం... ఇదే అంశంపై ప్రస్తుతం పాక్ నుంచి ఓ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పఠాన్‌కోట్‌కి వచ్చి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయం తెలుసుకున్న దావూద్ ఇబ్రహీం ఒక్కసారిగా స్టన్నయ్యాడట. అందులోనూ పాక్ నుంచి వచ్చిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో ఐఎస్ఐ కూడా వుందని తెలుసుకున్న దావూద్ మరింత ఎగ్జైట్‌మెంట్‌కి గురవుతున్నాడు. వీలైతే 1993 నాటి పేలుళ్ల కేసులో తన పాత్ర వుందనే ఆరోపణలపై విచారణ జరిపించేందుకు అనుమతించాల్సిందిగా అతడే భారత్‌కి ఓ ప్రపోజల్ పెడుతున్నాడు. కరాచీ నుంచి మా మాక్‌టేల్ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడిన దావూద్.. 'కచ్చితంగా భారత్ ఈ ఆఫర్‌ని కాదనుకుంటుందని అనిపించడంలేదు' అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు... ఎప్పటిలాగే తాను ప్రస్తుతం పాకిస్థాన్‌లో లేను అని నొక్కి ఒక్కానించి మరీ చెప్పుకొచ్చాడు. ఒకవేళ భారత్‌ నాపై ఆరోపించిన ఆరోపణలన్నీ నిజమని నిరూపించాలనుకుంటే, నేనే ఆ నేరానికి పాల్పడ్డానని నిరూపించుకునే ఆధారాలు సేకరించేందుకు వీలుగా విచారణకి అంగీకరించాలి. ఈ కేసులో దోషిగా శిక్ష పడటానికన్నా ముందుగా ఈ నేరానికి పాల్పడిన మాస్టర్ మైండ్ నాదేనా కాదా అనే విషయం నేను కూడా నిర్ధారించుకోవాలి కదా' అంటున్నాడు దావూద్. ఏదేమైనా ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడతానని దావూద్‌కి తనపై తనకి గట్టి నమ్మకం వుంది. తనకి తాను క్లీన్ చిట్ ఇచ్చుకున్న మొట్ట మొదటి క్రిమినల్‌గా చరిత్ర సృష్టించాలనుంది అంటూ ఎగ్జైట్ అవుతున్నాడు దావూద్. ఒకవేళ అరుదుగా ఇందులో తన పాత్ర వుందని తేలి శిక్ష అనుభవించాల్సి వస్తే, అందుకు కూడా నేను హ్యపీ. భారత్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ఆలోచన, విధానం పట్ల బాగా ఇంప్రెస్ అయిన దావూద్.. ఈ మార్పుకి గల క్రెడిట్‌ని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే ఇస్తున్నాడు. నేరస్తుడే విచారణ జరుపుకుని, తాను నేరానికి పాల్పడింది లేనిదీ తేల్చిచెప్పే స్వరాజ్ జస్టిస్ విధానం చాలా బాగుంది. బాహుశా ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే కానీ నాకు అటువంటి అవకాశం దొరకదనుకుంటాను. విచిత్రం ఏంటంటే.. నా విషయంలో బీజేపీ సైతం ఆ విధానాన్ని అవలంభిస్తుందేమోనని అనిపిస్తోంది. దేశంలో రాజకీయాలు మార్చేస్తానని అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంది కూడా ఇటువంటి మార్పే అనుకుంటా. ఇప్పుడు అన్ని రాజకీయపార్టీలు ఆప్ అడుగుజాడల్లో నడుస్తున్నాయేమో అనిపిస్తోంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు దావూద్.
Samayam Telugu mocktale under world dawn dawood ibrahim offers to investigate his role in mumbai 1993 blasts case
మాక్‌టేల్: నా కేసుని నేనే విచారించుకుంటా -దావూద్ ఇబ్రహీం


మాక్‌టేల్ గమనిక : మిమ్మల్ని సరదాగా నవ్వించడం కోసమే ఈ కథనం. నిజజీవితంలో వ్యక్తులు, ఘటనలతో ఈ కథనానికి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ ఫర్ ఫన్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.