యాప్నగరం

తన మరణ వార్తపై పరేష్ రావల్ రియాక్షన్.. ‘ఆ సమయంలో ఏం చేశానంటే’ అంటూ ట్వీట్

ఎవరైన ఒక సెలబ్రిటీ కొంతకాలం కనిపించకపోతే చాలా చనిపోయారంటూ.. వార్తలు రావడయం సోషల్‌మీడియాలో తరచూ జరిగే విషయమే. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్‌కి కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

Samayam Telugu 15 May 2021, 12:43 pm
రామ్ గోపాల్ వర్మ తీసిన ‘మనీ’, ‘గోవింద గోవింద’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్. ఇక చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాతో ఆయన సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎన్నో సినిమాల్లో తనదైన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరించిన పరేశ్ రావల్‌కు తాజాగా సోషల్‌మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన మరణించాడు అంటూ వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్ అయ్యారు.
Samayam Telugu పరేశ్ రావల్
Paresh Rawal


శుక్రవారం ఉదయం 7 గంటలకు పరేశ్ రావల్ తుదిశ్వాస విడిచారంటూ.. ఆయన ఫోటో పక్కన దీపాలు పెట్టి మరి కొందరు షేర్లు చేశారు. ఆయన మృతికి కొన్ని వేల మంది సంతాపం కూడా తెలిపారు. ఆయన మృతికి సంబంధించిన వార్తలను పలు వెబ్ మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. అయితే ఈ విషయంపై ఆయన చాలా ఫన్నీగా స్పందించారు. తన మరణవార్తకు సంబంధించిన ఫోటోని ట్వీట్ చేసిన ఆయన.. ‘‘సారీ.. ఆ సమయంలో నేను నిద్రపోతున్నాను’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. పరేశ్ పెట్టిన ఈ ఫన్నీ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Sama
సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పరేశ్ రావల్ సత్తా చాటారు.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా నటించిన ఆయన విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. గత ఏడాది సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూరరై పోట్రు’ సినిమాలో ఆయన నటించారు. ప్రస్తుతం ఆయన ‘హంగామ-2’, ‘తూఫాన్’, ‘ది స్టోరీ టెల్లర్’ తదితర చిత్రాలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.