యాప్నగరం

కరోనాతో ప్రముఖ టీవీ నటి దివ్య భట్నాగర్ కన్నుమూత

ప్రముఖ టీవీ నటి దివ్య భట్నాగర్ (34) కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆమె నేటి ఉదయం తుది శ్వాస విడిచారు.

Samayam Telugu 7 Dec 2020, 3:57 pm
ఈ ఏడాది కరోనా కారణంగా ఎంతోమంది తారలను కోల్పోయింది సినీ లోకం. ఏడాది ఆరంభం నుంచే యావత్ దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేటికీ తన ప్రభావం చూపిస్తూనే ఉంది. తాజాగా కరోనా కారణంగా ప్రముఖ టీవీ నటి దివ్య భట్నాగర్ (34) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె శరీరంలో ఆక్సీజన్ స్థాయిలు పడిపోయి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Samayam Telugu కరోనాతో ప్రముఖ టీవీ నటి దివ్య భట్నాగర్ మృతి
Divya Bhatnagar Death


నవంబర్ 26వ తేదీ నుంచి దివ్య భట్నాగర్‌కు కరోనా చికిత్స అందిస్తున్నప్పటికీ, ఆమె శరీరం సహకరించకపోవడంతో మరణించారని సన్నిహితులు పేర్కొన్నారు. కొద్దిరోజుల పాటు ఆమెను వెంటిలేటర్‌పై కూడా ఉంచినా ఫలితం లేదని అన్నారు. దివ్య భట్నాగర్ మరణవార్త తెలిసి పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపం తెలుపుతున్నారు. ఆమె మృతిపట్ల మృతిపట్ల నటులు దేవోలీనా భట్టాచార్జీ, శిల్పా శిరోద్కర్ విచారం వ్యక్తం చేశారు. ''యే రిష్టా క్యా కెహ్లతా హై, తేరా యార్ హూన్ మెయిన్'' షోలలో నటించి పాపులర్ అయ్యారు దివ్య భట్నాగర్.
View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

Also Read: Anushka Sharma: బాబోయ్.. విరుష్క జోడీ ఈ రేంజ్‌లో సంపాదిస్తున్నారా? ఇండియాలోనే మోస్ట్ రిచెస్ట్ కపుల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.