యాప్నగరం

చిత్రసీమలో మరో విషాదం.. సినీ నటి మిష్టీ ముఖర్జీ కన్నుమూత.. ఆమె మరణానికి కారణమిదే!!

బాలీవుడ్ యువ నటి మిష్టీ ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి మరణించారు.

Samayam Telugu 4 Oct 2020, 4:57 pm
ఈ ఏడాది చిత్రసీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పలు ఆరోగ్య కారణాలతో మరణిస్తుండటం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ యువ నటి మిష్టీ ముఖర్జీ కన్నుమూసిందనే వార్తతో బాలీవుడ్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలు సినిమాల్లో ఐటమ్ నంబర్స్ చేసి ఆకట్టుకున్న ఆమె.. కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించినట్లు తెలిసింది. ఆమె మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపుతున్నారు.
Samayam Telugu మిష్టీ ముఖర్జీ కన్నుమూత
Mishti Mukherjee


గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మిష్టీ ముఖర్జీ.. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించింది. బరువు తగ్గేందుకు గాను కిటో డైట్ ఫాలో అయిన ఆమె, ఆ కిటో డైట్ వికటించడం కారణంగానే కిడ్నీ ఫెయిల్యూర్ అయి మరణించినట్లు సమాచారం. శరీరంలో కిడ్నీ సహకరించకపోవడంతో చివరి రోజుల్లో ఆమె తీవ్ర నొప్పిని భరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2012లో సినీ కెరియర్ ప్రారంభించిన మిష్టీ ముఖర్జీ.. దాదాపు దశాబ్దకాలం పాటు సినీ ఇండస్ట్రీలో పలు పాత్రలు పోషించింది. 2014లో ఆమెపై సెక్స్ రాకెట్ నడిపారనే ఆరోపణలు కూడా వచ్చాయి.

Also Read: తమన్నాకు కరోనా పాజిటివ్.. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.