యాప్నగరం

ప్రముఖ దర్శకుడికి అస్వస్థత.. పరిస్థితి విషమం

బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ హీరోగా మిషన్‌ మంగళ్ సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు జగన్‌ శక్తి అనారోగ్యానికి గురయ్యారు.

Samayam Telugu 26 Jan 2020, 11:49 am
బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ హీరోగా మిషన్‌ మంగళ్ సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు జగన్‌ శక్తి అనారోగ్యానికి గురయ్యారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, ఆయన మెదడులో రక్తం గడ్డకట్టిందని డాక్టర్లు వెల్లడించారు.
Samayam Telugu Jagan Shakthi
అక్షయ్‌ కుమార్‌తో దర్శకుడు జగన్‌ శక్తి


ప్రస్తుతం జగన్‌ శక్తి ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కుటుంబం సభ్యులు ముంబై చేరుకున్నారు. ప్రముక వైధ్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతుందని సన్నిహితులు వెల్లడించారు. హాలీడే, ఇంగ్లీష్‌ వింగ్లీష్, డియర్‌ జిందగీ చిత్రాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేసిన జగన్‌ శక్తి, 2019లో రిలీజ్‌ అయిన మిషన్‌ మంగళ్ సినిమాతో దర్శకుడిగా మారారు.
Also Read: `మార్పు రావాల్సిన సమయమిది`.. రిపబ్లిక్‌ డే విషెస్‌ చెప్పిన స్టార్స్‌

తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌తో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఎక్కువగా అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన జగన్‌ ఆయన తొలి చిత్రానికి కూడా అక్షయ్‌నే హీరోగా ఎంచుకున్నాడు. అంతేకాదు త్వరలో తాను తెరకెక్కించబోయే రెండో సినిమా కోసం కూడా అక్షయ్‌ కుమార్‌తోనే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: ఏఎంబీని మించేలా.. భారీగా ప్లాన్ చేస్తున్న మహేష్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.