యాప్నగరం

గర్వంగా చెప్పుకునే క్షణం వస్తుంది.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై అమితాబ్ బచ్చన్‌ రియాక్షన్

దేశంలో ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. గర్వంగా చెప్పుకునే క్షణం వస్తుందంటూ ట్వీట్ చేశారు.

Samayam Telugu 17 Jan 2021, 9:11 pm
గత సంవత్సర కాలంగా ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. కరోనా కారణంగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో ఆర్థికంగా పేద ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ అని చెప్పలేం. ఈ ఎఫెక్ట్‌తో చాలా దేశాలు ఆర్థిక నష్టాలతో విలవిలలాడి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రయత్నాలు చేసి కరోనా మహమ్మారిపై పోరాటం ప్రారంభించాయి వైద్య బృందాలు. ఇందులో భాగంగా మన దేశంలో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది.
Samayam Telugu గర్వంగా చెప్పుకునే క్షణం వస్తుంది.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై అమితాబ్ బచ్చన్‌ రియాక్షన్
Amitabh Bachchan

RED చూశాక రామ్ ఫ్యాన్ అయ్యా.. ఆయన కారణంగా అందరి నోటా అదే పిలుపు.. హాట్ బ్యూటీ మాళవిక శర్మ
తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. తాజాగా దీనిపై బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ ట్విట్టర్ వేదికగా‌ రియాక్ట్ అయ్యారు. "పోలియో రహిత దేశంగా మన భారతదేశం మారినప్పుడు ఎంతో గర్వించాం. అదే తరహాలో కోవిడ్‌- 19 రహిత దేశమని గర్వంగా చెప్పుకునే క్షణం కూడా రాబోతోంది" అని అమితాబ్‌ పేర్కొన్నారు. గతేడాది అమితాబ్‌ బచ్చన్‌, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకొని వారంతా కోలుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.