యాప్నగరం

అమ్మ మరణం.. నాలుగురోజుల్లోనే ఇర్ఫాన్ ఖాన్ అమ్మ చెంతకు.. కన్నీళ్లు పెట్టించే విషాద ఘటన

నాకు బ్ర‌తుకుపై ఆశను, జీవించడానికి కావలసిన ధైర్యాన్ని నూరిపోస్తున్నా‌రు.. నాకు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే డిసీజ్ ఉన్నట్లు నిర్దార‌ణ అయ్యింది.. దాన్ని నేను జయిస్తానంటూ ఇటీవల ఎమోషన్ పోస్ట్ చేసిన ఇర్ఫాన్ ఖాన్. ఆ మహమ్మారితో పోరాటంలో ఓడిపోయారు. బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 29 Apr 2020, 2:39 pm
విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్తతో బాలీవుడ్ పరిశ్రమ శోకసంద్రంలో ఉంది. ఆయనకు టాలీవుడ్ పరిశ్రమతోనూ మంచి అనుబంధం ఉంది. 2006లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘సైనికుడు’ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు ఇర్పాన్ ఖాన్. మినిస్టర్ పప్పు యాదవ్‌గా ఆయన చూపించిన విలక్షణ నటన తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది.
Samayam Telugu తల్లితో ఇర్ఫాన్ ఖాన్
irrfan khan mother


గత కొంత కాలంగా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ బుధవారం నాడు ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే సరిగ్గా నాలుగురోజుల క్రితం అంటే శనివారం నాడు ఇర్పాన్ ఖాన్ తల్లి సయిదా బేగం.. రాజస్థాన్లోని జైపుర్లో క‌న్నుమూశారు. అప్పటికి ఆరోగ్యంగానే ఉన్న ఇర్ఫాన్ ఖాన్.. లాక్ డౌన్ నిబంధనల వల్ల ముంబై నుంచి జైపూర్ వెళ్లలేకపోయారు. తన తల్లి కడచూపుకు దూరమయ్యారు. తల్లి సయిదా బేగం అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారానే ఇర్ఫాన్ చుశారని అతని సన్నిహితులు తెలియజేస్తున్నారు.

అయితే తల్లి చనిపోయిన నాలుగురోజుల్లోనే ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ లోకాన్ని విడవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తల్లిని వదిలి నాలుగురోజులైనా ఉండలేకపోయావా? ఇర్ఫాన్ అంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.