యాప్నగరం

చిత్రసీమలో మరో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి

సినీ లోకాన్ని కలవరపెట్టే వార్తలు రోజూ వస్తుండటం దురదృష్టకరం. వరుస మరణాలతో చిత్రసీమలో విషాదఛాయలు అలుముకుంటున్నాయి.

Samayam Telugu 24 May 2020, 1:56 pm
చిత్రసీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న సీనియర్‌ నటి వాణి శ్రీ కుమారుడు అభినయ్‌ వెంకటేశ్‌ కార్తీక్‌, మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ మరణించారనే వార్త నుంచి తేరుకోకముందే మరో యువ నటుడు మోహిత్ బఘేల్ కన్నుమూశారనే వార్త చిత్ర వర్గాలను కలవరపెడుతోంది. నిన్న (శనివారం) బాలీవుడ్‌ యువ నటుడు మోహిత్‌ బఘేల్ (26) క్యాన్సర్‌తో మృతి చెందారు.
Samayam Telugu చిత్రసీమలో మరో విషాదం.. యువ నటుడు మృతి
Mohit Baghel


గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్న మోహిత్‌ బఘేల్.. శనివారం ఉదయం తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో మరణించినట్టు రచయిత, దర్శకుడు రాజ్ శాండిల్య పేర్కొనడంతో విషయం వెలుగులోకి వచ్చింది. క్యాన్సర్ బారినపడిన మోహిత్ గత కొన్ని నెలలుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడని, ఈ నెల 15న అతడితో మాట్లాడానని అన్నాడు రాజ్ శాండిల్య. అప్పుడు బాగానే ఉన్న మోహిత్ మరణవార్త తీవ్రంగా కలచివేసిందని ఆయన అన్నాడు. మోహిత్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నేను సింగిల్ పీస్.. ఎప్పటికీ అతనే నా బాయ్ ఫ్రెండ్.. ఆన్‌లైన్ వేదికపై అనసూయ జబర్దస్తీ!!

రియాలిటీ షో చోటే మియాన్‌తో కెరీర్ ఆరంభించిన మోహిత్‌ బఘేల్.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ‘రెడీ’ సినిమాలో నటించాడు. సిద్దార్థ్‌ మల్హోత్రా, పరిణితీ చోప్రా జంటగా నటించిన జబారియా 'జోడి' చిత్రంలో కూడా మోహిత్ నటించాడు. ఆయన మరణం బాలీవుడ్ వర్గాల్లో విషాదఛాయలు నింపేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.