బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు కొందరు నటులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరోవైపు కొందరు నటులు చిన్న వయస్సులోనే.. అనారోగ్యంతో మరణిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్ మరణం నుంచి సినీ ఇండస్ట్రీ కోలుకోక ముందే.. మరో నటుడు మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రంజన్ సెహగల్ గత రాత్రి మరణించాడు. పంజాబ్లోని చండీగఢ్లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచాడు.
శరీరంలోని అవయవాలు పనిచేయకపోవడం వల్లనే రంజన్ మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ముందుగా రంజన్ బుల్లితెరపై మెరిశాడు. నటనలో తన టాలెంట్తో ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. బాలీవుడ్లో పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. 2016లో రణ్దీప్ హుడా, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'సరబజిత్' సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఫోర్స్, కర్మ వంటి బాలీవుడ్ చిత్రాలతోపాటు పంజాబీ సినిమాల్లోనూ నటించాడు. అకస్మాత్తుగా రంజన్ మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
Read More: బ్రేకింగ్: ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు కరోనా పాజిటివ్
మరోవైపు బాలీవుడ్ ప్రముఖుల్ని ఇప్పుడు కరోనా కూడా వెంటాడుతోంది. కరోనాతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా బచ్చన్ ఫ్యామిలీ కరోనా బారిన పడింది. అమితాబ్, అభిషేక్ బచ్చన్లతో పాటు ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా సోకింది. అటు విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబంలో కూడా కరోనా కలకలం రేపింది. అనుపమ్ తల్లితో పాటు అన్న, వదిన, వారి కూతురు సైతం కరోనా బారిన పడ్డారు.
శరీరంలోని అవయవాలు పనిచేయకపోవడం వల్లనే రంజన్ మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. ముందుగా రంజన్ బుల్లితెరపై మెరిశాడు. నటనలో తన టాలెంట్తో ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. బాలీవుడ్లో పలు సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. 2016లో రణ్దీప్ హుడా, ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'సరబజిత్' సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఫోర్స్, కర్మ వంటి బాలీవుడ్ చిత్రాలతోపాటు పంజాబీ సినిమాల్లోనూ నటించాడు. అకస్మాత్తుగా రంజన్ మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
Read More: బ్రేకింగ్: ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు కరోనా పాజిటివ్
మరోవైపు బాలీవుడ్ ప్రముఖుల్ని ఇప్పుడు కరోనా కూడా వెంటాడుతోంది. కరోనాతో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా బచ్చన్ ఫ్యామిలీ కరోనా బారిన పడింది. అమితాబ్, అభిషేక్ బచ్చన్లతో పాటు ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా సోకింది. అటు విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబంలో కూడా కరోనా కలకలం రేపింది. అనుపమ్ తల్లితో పాటు అన్న, వదిన, వారి కూతురు సైతం కరోనా బారిన పడ్డారు.