Bollywood Actress Deepika Padukone Starrer Chhapaak Trailer Unveiled And It Will Make You Cry
Deepika Padukone కొత్త సినిమా ట్రైలర్... కన్నీరాగదు
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఛపాక్’. పెళ్లి తర్వాత దీపిక నటించిన మొదటి సినిమా ఇది. మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేశారు. విక్రాంత్ మస్సే దీపిక ప్రియుడి పాత్రలో నటించారు. ఇందులో ఆమె యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు.
Samayam Telugu10 Dec 2019, 2:03 pm
బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఛపాక్’. పెళ్లి తర్వాత దీపిక నటించిన మొదటి సినిమా ఇది. మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేశారు. విక్రాంత్ మస్సే దీపిక ప్రియుడి పాత్రలో నటించారు. ఇందులో ఆమె యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు.
దీపిక ఏడిపించేసింది
ట్రైలర్లో దీపిక నటన ఏడిపించేసింది. ఇందులో ఆమె పాత్ర పేరు మాలతి. యాసిడ్ దాడికి గురైనప్పుడు పడే బాధ ఎలా ఉంటుందో ఆమె కళ్లకు కట్టినట్లు చూపించింది. కాలిపోయిన తన ముఖాన్ని అద్దంలో చూసుకోలేక అరిచే సన్నివేశం, కమ్మలు పెట్టుకుందామంటే చెవులు కూడా కాలిపోయి ఉండటాన్ని చూపించిన సన్నివేశాలు హృదయాలను ద్రవింపజేస్తుంది. దాదాపు 50 ప్లాస్టిక్ సర్జరీలు చేశాక మాలతి ముఖం కాస్త చూసే విధంగా మారుతుంది. అది ఆమెలో ఆత్మవిశ్వాసం నింపుతుంది.
లక్ష్మీ అగర్వాల్ జీవిత గాథ
దిల్లీకి చెందిన లక్ష్మీ అగర్వాల్ అనే యువతిపై 2005లో యాసిడ్ దాడి జరిగింది. యావత్ భారతదేశం ఈ దాడితో దద్దరిల్లింది. యాసిడ్ దాడి జరిగినప్పుడు లక్ష్మి వయసు పదిహేనేళ్లు. ప్రేమించమంటూ వెంటపడిన ఓ కుర్రాడు లక్ష్మిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కోలుకున్న లక్ష్మి దేశంలో యాసిడ్ అమ్మకాలు ఆపాలంటూ క్యాంపెయిన్ను ప్రారంభించారు. ఈమె జీవితాధారంగానే ‘ఛపాక్’ సినిమాను తెరకెక్కించారు. అయితే రేప్, యాసిడ్ దాడి బాధితురాళ్ల పేర్లు బయటికి చెప్పకూడదన్న నిబంధన ఉన్నందుకు సినిమాలో దీపిక పేరును మాలతి అని పెట్టారు.
ట్రైలర్ లాంచ్ వేడుకలో ఏడ్చేసిన దీపిక
‘ఛపాక్’ ట్రైలర్ను లాంచ్ చేస్తున్నప్పుడు దీపిక కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి కథలు మన ముందుకు తరచూ రావు. ఓ డైరెక్టర్ వచ్చి స్క్రిప్ట్ వివరిస్తే ఓకే చెప్పే కథ కాదు ఇది. ఎమోషనల్గా ఈ కథను కనెక్ట్ అయ్యాను కాబట్టే నిర్మించడానికి కూడా ఒప్పుకున్నాను. ఈ సినిమా ప్రభావం మన అందరిపై ఉంటుంది. కనీసం ఈ సినిమా చూశాకైనా ప్రజల్లో అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు. 2020 జనవరి 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.