యాప్నగరం

వెనక్కి తగ్గని జూహీ చావ్లా.. 5G నెట్ వర్క్‌పై పోరు ముమ్మరం చేస్తూ వీడియో

బాలీవుడ్ ప్రముఖ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా 5జి మొబైల్ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. 5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై తీవ్ర ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు.

Samayam Telugu 9 Jun 2021, 4:20 pm
టెక్నాలజీ రోజురోజుకీ ఎంత రూపాంతరం చెందుతుందో.. అంతే ప్రమాదకరంగా మారుతోంది. ఏదో అద్భతమైన సృష్టి వచ్చిందని ఆనందించే లోపే.. దాని ద్వారా ఎన్నో ప్రమాదాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా మొబైల్ ఫోన్ నిలుస్తోంది. మొబైల్ ఫోన్ కోసం ఏర్పాటు చేసే.. సిగ్నల్స్.. ద్వారా రేడియేషన్ పెరిగి.. ఎన్నో జీవజాతులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అయినప్పటికీ.. టెలికాం కంపెనీలు అవేమీ పట్టవు అన్నట్లు.. సిగ్నల్స్‌ను పెంచుకుంటూ పోతున్నారు. మొదలు 2జీ, ఆ తర్వాత 3జీ, ప్రస్తుతం 4జీ సిగ్నల్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరలో 5జీని కూడా తీసుకువస్తామని టెలికాం కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. అది అమలు అవుతుంది కూడా.
Samayam Telugu జూహీ చావ్లా
juhi chawla


అయితే దీనిపై ప్రముఖ బాలీవుడ్ నటి జుహీ చావ్లా వ్యతిరేకత వ్యక్తం చేశారు. 5జీని అందుబాటులోకి తీసుకురావడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. 5జి మొబైల్ టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా జూహీ చావ్లా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5జీ టెక్నాలజీతో మనుషులు, మూగజీవాలపై ప్రస్తుతం ఉన్న ప్రభావం కంటే 10 నుంచి 100 రెట్ల అధిక ప్రభావం పడుతుందని జూహీ చావ్లా వెల్లడించారు. తాజాగా ఈ విషయంపై ఆమె వివరణ ఇచ్చారు. తన సోషల్‌మీడియాలో ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు.

5జీని వ్యతిరేకించిన ఆమెపై వ్యతిరేకత వచ్చిన విషయాన్ని ఆమె పరోక్షంగా వెల్లడించారు. అయితే తాను 5జీ అమలుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ, ఈ టెక్నాలజీ అమలు కావడం వల్ల ప్రజలు అందరు సురక్షితంగా ఉంటారని హామీ ఇవ్వాలని ఆమె కోరారు. పిల్లలు, గర్భవతులు, వృద్ధులు తదితరులు ఇది అమలు అయిన తర్వాత కూడా సురక్షితంగా ఉంటారా లేదా.. అనే విషయాన్ని ప్రశ్నించామని ఆమె తెలిపారు. దీనిపై ప్రజలందరికీ క్లారిటీ ఇవ్వాలని ఆమె కోరారు.
View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.