యాప్నగరం

Emergency: నేను కింద పడాల‌ని కోరుకున్నారు.. బాధ పెడుతున్నారు.. కంగ‌నా ర‌నౌత్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ప్రస్తుతం ‘ఎమర్జన్సీ’ సినిమా చిత్రీకణను పూర్తి చేశారు. ఆ సందర్భంగా ఆమె తన ఎమోషన్ జర్నీ గురించి ఓ నోట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 22 Jan 2023, 2:35 pm
బాలీవుడ్‌లో కాంట్ర‌వ‌ర్సియ‌ల్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న నటి కంగ‌నా ర‌నౌత్‌. ఏ విష‌యాన్ని అయినా త‌ను అనుకున్న‌ది అనుకున‌ట్లు చెప్పేస్తుంది. ఎదుటివారు ఏమ‌నుకుంటారోన‌ని ఆలోచించ‌దు. అలాగే న‌టిగానూ త‌న‌దైన చిత్రాల్లో న‌టిస్తూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఆమె సంపాదించుకుంది. న‌టిగానే కాకుండా నిర్మాత‌గానూ ద‌ర్శ‌కురాలిగానూ రాణిస్తున్నారామె. ప్ర‌స్తుతం కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తోన్న చిత్రం ‘ఎమర్జన్సీ’. ఈ సినిమాలో ఆమె మాజీ మ‌హిళా ప్ర‌ధాని ఇందిరాగాంధీ పాత్ర‌ను పోషిస్తుంది. న‌టిగానే కాకుండా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌న బ్యాన‌ర్‌లో సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Samayam Telugu bollywood actress kangana ranaut emotional post about emergency movie
Emergency: నేను కింద పడాల‌ని కోరుకున్నారు.. బాధ పెడుతున్నారు.. కంగ‌నా ర‌నౌత్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌


‘ఎమర్జన్సీ’ సినిమా చిత్రీక‌ర‌ణంతా ముగిసింది. ఈ సంద‌ర్భంగా కంగ‌నా ర‌నౌత్ చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ‘‘‘ఎమర్జన్సీ’ సినిమా ప్రయాణంలో నటిగా నా పని పూర్తయ్యింది. నా జీవితంలో ఇదొక అద్భుత‌మైన ఘ‌ట్టం అని చెప్పాలి. ఈ సినిమా కోసం నేను చేసిన ప్ర‌యాణం చాలా మందికి సాఫీగా సాగిన‌ట్లు అనిపించింది. కానీ.. అందులో నిజం లేదు. ఎందుకంటే చాలా ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కొన్నాను. కొంద‌రు నేను కింద ప‌డిపోవాల‌ని కోరుకున్నారు. కొంద‌రైతే న‌న్ను బాధ పెట్టే ప్ర‌తీ విష‌యాన్ని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే డెంగ్యూ బారిన ప‌డ్డాను. నా ఆస్తుల‌ను త‌న‌ఖా పెట్టాను. అయితే ఏవీ న‌న్ను అప‌లేదు. ధైర్యంగా ముందుకెళ్లాను. ఇది నాకు పున‌ర్జ‌న్మ‌లా ఇంత‌కుముందెన్న‌డూ లేనట్లుగా అనిపిస్తుంఇ. ఈ ప్ర‌యాణంలో నాకు తోడుగా ఉంన్న చిత్ర యూనిట్‌కు ధ‌న్య‌వాదాలు’’ అని తెలిపారు కంగనా రనౌత్.

ఎమర్జన్సీ సినిమా ప్రయాణం గురించి కంగన చేసిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. రీసెంట్ టైమ్‌లో కంగనా రనౌత్ ‘బహుభార్యత్వం (Polygamy), యాసిడ్ దాడుల’ నుంచి మహిళలను రక్షించ‌టానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అందు కోసం కొత్త చట్టాలను రూపొందించాలని ప్రధాని నరేంద్ర (Nrendra Modi) మోడీని అభ్యర్థించింది.

View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut)


ALSO READ: Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’ను నేనే డైరెక్ట్ చేయాల్సింది ... బాబీతో గొడ‌వ‌లేం లేవు: గోపీచంద్ మలినేని
ALSO READ: James Cameron: Rajamouliకి జేమ్స్ కామెరూన్ అదిరిపోయే ఆఫర్.. RRRపై హాలీవుడ్ డైరెక్టర్ రివ్యూ
ALSO READ: Pathaan : పఠాన్ ప్రమోషన్స్.. రామ్ చరణ్‌ తీసుకెళ్తే వస్తా!.. బాలీవుడ్ బాద్ షా ట్వీట్ వైరల్

రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.