యాప్నగరం

మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది: ముఖ్యమంత్రిపై కంగనా ఫైర్

దసరా ర్యాలీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనపై చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోియిన్ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడింది. మీలా నేను చెత్త ప్రొడక్ట్‌ని కాదంటూ కౌంటర్ ఇచ్చింది.

Samayam Telugu 26 Oct 2020, 3:39 pm
మహారాష్ట్ర సర్కారు, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శివసేన దసరా ర్యాలీ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చిన కొందరు ముంబై నగరాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)తో పోల్చారని, వారు నమ్మకద్రోహలుగా మిగిలిపోతారని ఉద్ధవ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Samayam Telugu కంగనా రనౌత్


Also Read: ఒక్క రూపాయికే విమానం టిక్కెట్... ఆసక్తికరంగా ‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్

అసలే మహారాష్ట్ర సర్కారుపై ఆగ్రహంతో ఉన్న కంగనాను ఉద్ధవ్‌ వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టాయి. దీంతో తన కోపాన్ని వెళ్లగక్కుతూ వరుస ట్వీట్లతో రెచ్చిపోయింది. ‘నువ్వు వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని వచ్చిన నొపొటిజం ప్రొడక్ట్‌వి’ అంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై ధ్వజమెత్తింది. ‘ఉద్ధవ్ నన్ను నమ్మక ద్రోహి అన్నారు. ముంబై నాకు షెల్టర్ ఇవ్వకపోతే నాకు తిండి కూడా దొరకదని అన్నారు. నాకు మీ కొడుకు వయసుంటుంది. జీవితంలో కష్టపడి ఎదిగిన ఒంటరి మహిళ ఇలా మాట్లాడిన మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది. ముఖ్యమంత్రి గారూ.. మీరొక చెత్త నెపోటిజమ్ ప్రొడక్ట్` అని ట్వీట్ చేసింది.

Also Read: పనిమనిషిలా ఉంది హీరోయిన్‌గా వద్దన్నాడు.. చివరికి ఆమెనే పెళ్లాడాడు

మరో ట్వీట్‌లో ‘సీఎం గారూ.. మీలా తండ్రి అధికారం, డబ్బు అడ్డుపెట్టుకునే తాగుబోతును కాదు. నేను వారసత్వాన్ని నమ్ముకుని ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. నేను కూడా ఓ ఘనమైన వారసత్వం ఉన్నతమైన కుటుంబం నుంచే వచ్చాను. కానీ, నేను ఆ వారసత్వం మీద, సంపద మీద ఆధారపడదలచుకోలేదు. కొంతమందికి ఆత్మగౌరవం, స్వీయ విలువ ఉంటాయి’ అని కంగన ఘాటుగా ట్వీట్ చేసింది.

Also Read: ఆ అలవాట్లతో కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. రీఎంట్రీకి రెడీ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.