యాప్నగరం

అతడంటే పిచ్చి... వీకెండ్‌లో కలుసుకునేవాళ్లం: కియారా

తాను ప్లస్‌టూ చదివే రోజుల్లో ఓ అబ్బాయిని చాలా ఇష్టపడ్డానని, వీకెండ్‌లో కుటుంబసభ్యులకు మస్కా కొట్టి అతడి వద్దకు వెళ్లేదాన్నని తెలిపింది బాలీవుడ్ నటి కియారా అద్వానీ.

Samayam Telugu 22 Oct 2020, 7:54 am
అతి తక్కువ సినిమాలతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది కియారా అద్వానీ. భరత్ అనే నేను, వినయ విధేయ రామ.. చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన మనసుకు నచ్చితే ఎలాంటి పాత్రకైనా ఓకే చెప్పడం ఆమె నైజం. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కియారా హైస్కూల్‌ రోజుల్లోని తన ప్రేమాయణం గురించి బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేసింది.
Samayam Telugu కియారా అద్వానీ


Also Read: అదే లుక్‌లో పవన్ కళ్యాణ్.. ఫీలవుతున్న ఫ్యాన్స్

‘ప్లస్‌ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవురోజుల్లో ఇంట్లో వాళ్లకి ఏదొక అబద్ధం చెప్పి అతడిని కలుసుకునేదాన్ని. దీంతో చదువును అశ్రద్ధ చేస్తున్నానని నా పేరెంట్స్ కోప్పడేవారు. అప్పుడు చదువా? ప్రేమా? అన్న సంఘర్షణ పడి చివరికి ప్రేమను త్యాగం చేశారు. ఆ టైమ్‌లో మానసికంగా చాలా సంఘర్షణ పడ్డాను. కానీ వయసు పరిపక్వతతో త్వరగానే కోలుకున్నానని కియారా చెప్పారు.

Also Read: క్యాన్సర్‌ను జయించా.. కొడుకుల పుట్టినరోజు నాడు శుభవార్త చెప్పిన సంజయ్ దత్

కియారా ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా మారింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సుందరి మోడ్రన్ డ్రెస్‌లతో సంప్రదాయ దుస్తుల్లోనూ ఫొటో షూట్స్‌ చేస్తూ ఈ ఫోటోలను తరుచూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. కియారా ‘లక్ష్మీ బాంబ్’ ‘ఇందూ కి జవానీ షేర్ షా’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “బుల్ భులయ్యా 2” మూవీ షూటింగ్ దశలో ఉంది.

Also Read: వరద బాధితులకు అండగా సంపూర్ణేష్ బాబు.. మంత్రిని కలిసి విరాళం అందజేత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.