యాప్నగరం

రియాకు షాకిచ్చిన కోర్టు.. అప్పటివరకు కస్టడీలో ఉండాల్సిదే

డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్న రియా చక్రవర్తికి కోర్టు షాకిచ్చింది. అక్టోబర్ 6వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీలోనే ఉండాలని ఆదేశాలిచ్చింది.

Samayam Telugu 22 Sep 2020, 7:57 pm
బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలున్నాయని ఆరోపణలతో అరెస్టయిన నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని వచ్చే నెల అక్టోబర్‌ 6 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో రియాతో పాటు అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు సెప్టెంబర్ 11న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం వీరంతా ముంబయిలోని బైకుల్లా జైల్లో ఉన్నారు.
Samayam Telugu రియా చక్రవర్తి


Also Read: మద్రాస్ హైకోర్టు ఎంట్రీ: చిక్కుల్లో విశాల్ కొత్త సినిమా

మరోవైపు రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్‌ బుధవారం(సెప్టెంబర్ 23) విచారణకు రానుంది. డ్రగ్స్‌ కేసులో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్టు చేసిన మిగతా నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెడుతామని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ సర్పందే తెలిపారు.

Also Read: బాలీవుడ్ డ్రగ్స్ కేసు: నమ్రతా శిరోద్కర్‌పై నేషనల్ మీడియా కథనాలు

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో రియా చక్రవర్తి ప్రమేయం ఉందంటూ సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ విభాగాలు రంగంలోకి దిగాయి. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ లింకులు బయటపడ్డాయి.

Also Read: తనను పెళ్లి చేసుకోవాలంటే ఇలా చేయాలంట!.. ఫ్యాన్‌కి రష్మిక క్యూట్ రిప్లయ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.