యాప్నగరం

‘నాలాంటి హీరోయిన్‌‌కు ఆయన ఛాన్స్ ఎందుకిస్తారు?’

తనలాంటి హీరోయిన్‌తో కలిసి సంజయ్ లీలా భన్సాలీ ఎందుకు పనిచేస్తారని బాధపడుతున్నారు తనుశ్రీ దత్తా. తనకు జరిగిన లైంగిక వేధింపుల్ని బయటపెట్టి మీటూ ఉద్యమానికి తెరలేపారు తనుశ్రీ.

Samayam Telugu 18 Oct 2019, 3:21 pm
బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనతో ఓ సినిమా సెట్‌లో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి మీటూ ఉద్యమానికి తెర లేపారు నటి తనుశ్రీ దత్తా. దాదాపు పదేళ్లుగా ఆమె బాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు తనకు మళ్లీ నటించాలని ఉందని అన్నారు. అది కూడా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉందని మీడియా ద్వారా తన ఇష్టాన్ని బయటపెట్టారు.
Samayam Telugu tanushree dutta
తనుశ్రీ దత్తా


READ ALSO: హాస్పిటల్‌లో చేరిన అమితాబ్ బచ్చన్

‘పదేళ్ల తర్వాత సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. నేను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు చూశాను. నాకు చాలా నచ్చాయి. ఆయన సినిమాలు నాకు చాలా నచ్చుతాయి. నాలాంటి హీరోయిన్‌తో ఆయన కలిసి పనిచేస్తారో లేదో తెలీదు కానీ నాకైతే ఆయన సినిమాలో నటించాలని ఉంది. కానీ భన్సాలీ కేవలం టాప్ స్టార్స్‌తోనే పనిచేస్తారు. నాకు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి భన్సాలీ అంటే ఎంతో ఇష్టం. కానీ ఆయన లాంటి దర్శకుడితో కలిసి పనిచేయాలంటే ఆడిషన్స్‌కు వెళ్లడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే సినిమాలో బిజినెస్ యాంగిలే ఎక్కువగా ఉంటుంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆ దర్శకుడితో నటించాలని ఈ దర్శకుడితో నటించాలని కలలు కనేదాన్ని. కానీ అవేవీ నెరవేరలేదు. అందుకే ఆలోచించడం మానేశాను. దాని వల్ల బాధ తప్ప ఏమీ మిగలదు. నాకు మేనేజ్‌మెంట్ టీం కూడా లేదు. కాబట్టి నన్ను ఎవరు సంప్రదించాలనుకుంటున్నారో కూడా తెలీదు. ఈసారి అవకాశం వస్తే ఏదన్నా మంచి ప్రాజెక్ట్‌లో నటించాలని ఉంది’ అని తెలిపారు.

READ ALSO: ‘ఆ నటిని నేను చంపలేదు.. కేసు పెట్టినవారు ఎక్కడ?’

తనుశ్రీ దత్తాకు సినిమా వల్ల అంతగా పాపులారిటీ రాలేదు కానీ ఆమె ఎప్పుడైతే తనకు నానా పటేకర్ వల్ల కలిగిన ఇబ్బంది గురించి బయటపెట్టిందో ఇండియాలో ఆమె పేరు మారుమోగిపోయింది. తనుశ్రీని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో నటీనటులు, సాధారణ ఆడపిల్లలు తాము జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. కానీ ఇంత చేసినా తనుశ్రీ పేరు మిగిలింది తప్ప తనకు న్యాయం మాత్రం జరగలేదు. తనుశ్రీ చేస్తున్న ఆరోపణలకు రుజువులు లభించలేదని పోలీసులు కోర్టుకు చెప్పడంతో నానా పటేకర్‌ను నిర్దోషిగా తేల్చారు. తెలుగులో ఆమె బాలకృష్ణతో కలిసి ‘వీరభద్రుడు’ సినిమాలో నటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.