యాప్నగరం

సుశాంత్‌ డ్రగ్స్ కోసం నన్ను వాడుకున్నాడు: రియా సంచలన ఆరోపణలు

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని, డ్రగ్స్ సరఫరా చేసేందుకు తనను వాడుకున్నాడని రియా చక్రవర్తి సంచలన ఆరోపణలు చేసింది. బెయిల్ పిటిషన్‌లో ఇలా ఆరోపణలు చేసింది.

Samayam Telugu 23 Sep 2020, 2:29 pm
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్ వినియోగం ఆరోపణలతో అరెస్టయిన బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి మరో బాంబు పేల్చారు. బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో సుశాంత్‌ గురించి నమ్మశక్యం కాని విషయాలు వెల్లడించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తరుచూ డ్రగ్స్‌ తీసుకునేవాడని, డ్రగ్స్ తీసుకురావాలంటూ సిబ్బందిని కోరేవాడని పేర్కొంది. సుశాంత్ జీవించి ఉంటే అతడిపై తక్కువ అభియోగాలు నమోదయ్యేవని, ఏడాది మాత్రమే జైలుశిక్ష విధించేవారని తెలిపింది. డ్రగ్స్ కోసం తనను, తన సోదరుడితో పాటు ఇతరులను సుశాంత్ వాడుకున్నాడని రియా ఆరోపించింది.
Samayam Telugu Rhea Chakraborty


Also Read: జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు, అది ఫేక్ న్యూస్: దియా మీర్జా

‘సుశాంత్‌ డ్రగ్స్‌ కోసం నాతో క్లోజ్‌గా ఉండేవాడు. నా సోదరుడిని, సిబ్బంది డ్రగ్స్ కోసం వేధించేవాడు. అతడు చేసిన దానికి ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తవున్నాం’ అని రియా విచారణలో ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించిన డ్రగ్స్ ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 9 న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె జ్యుడిషియల్ కస్టడీ నిన్నటితో ముగియగా.. న్యాయస్థానం అక్టోబర్ 6 వరకు పొడిగించింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించింది. తాజా బెయిల్ పిటిషన్‌ విచారణను బాంబే హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

Also Read: రియాకు షాకిచ్చిన కోర్టు.. అప్పటివరకు కస్టడీలో ఉండాల్సిదే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.