యాప్నగరం

చిక్కుల్లో పడిన అనురాగ్ కశ్యప్‌.. నటి ఫిర్యాదుతో రేప్ కేసు నమోదు

బాలీవుడ్ స్టార్ ఫిలిమ్ మేకర్ అనురాగ్ కశ్యప్‌పై అత్యాచారం కేసు నమోదైంది. తనను లైంగికంగా దోచుకున్నాడంటూ ఓ నటి ఇచ్చి ఫిర్యాదుతో ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.

Samayam Telugu 23 Sep 2020, 4:29 pm
బాలీవుడ్ దర్శక, నిర్మాత అనురాగ్ కశ్యప్‌ను వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సినిమాలో ఛాన్స్ కోసం వెళ్లిన తనను కశ్యప్ గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిలిమ్ చూపించారంటూ నటి పాయల్ ఘోష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కొద్దిరోజులుగా బాలీవుడ్‌లో రచ్చ జరుగుతుండగానే ఆయనకు చాలామంది నుంచి మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనపై రేప్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.
Samayam Telugu అనురాగ్ కశ్యప్


Also Read: సుశాంత్‌ డ్రగ్స్ కోసం నన్ను వాడుకున్నాడు: రియా సంచలన ఆరోపణలు

ప్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ నటి చేసిన ఫిర్యాదుపై ముంబయిలోని వెర్సోవా పోలీసులు ఆయనపై రేప్ కేసు నమోదు చేశారు. 2013 లో వెర్సోవాలోని ఓ ప్రాంతంలో తన క్లయింటుపై అనురాగ్ కశ్యప్ అత్యాచారానికి పాల్పడ్డాడని నటి తరపు లాయర్ తెలిపారు. దీంతో ఈ కేసు విచారణలో భాగంగా కశ్యప్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తామని పోలసీులు చెబుతున్నారు. పాయల్ ఆరోపణల విషయంలో బాలీవుడ్‌లోని ఓ వర్గం నుంచి మద్దతు కూడగట్టుకున్న అనురాగ్ కశ్యప్‌ తాజా కేసు నుంచి ఎలా భయపడతారో చూడాలి.

Also Read: నమ్రతా శిరోద్కర్‌కి బండ్ల గణేష్ సపోర్ట్.. ఆమె ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.