యాప్నగరం

కరోనా వైరస్‌ను అంతమొందిచమని మోదీ నన్ను చైనా పంపారు: ఈ పాప పిచ్చి పీక్స్‌లో ఉంది

కరోనా వైరస్‌ను అంతమొందించి రావాలని తనను మోదీ చైనాకు పంపించాడంటూ తిక్క తిక్కగా వాగుతోంది నటి రాఖీ సావంత్. ఆమె పోస్ట్ చేసిన వీడియో చూస్తే పగలబడి నవ్వుకుంటారు.

Samayam Telugu 6 Feb 2020, 4:05 pm
వామ్మో... చైనాను హడలెత్తిస్తున్న కరోనా వైరస్‌ను అంతమొందించేసానంటోంది బాలీవుడ్ వివాదాస్పద నటి రాఖీ సావంత్. పైగా తనను చైనా పంపించింది ప్రధాని నరేంద్ర మోదీనే అంటూ మరో షాకింగ్ వీడియోను వదిలింది.
Samayam Telugu rakhi sawant
రాఖీ సావంత్


‘‘భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్‌ను అంతమొందిచమని నన్ను చైనాకు పంపారు. ఇందుకు నేనైతేనే కరెక్ట్ అని ఆయన భావించి నన్ను ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో చైనా పంపించారు. నేను అనుకున్నట్లుగానే చైనాలో కరోనాను అంతమొందించేసాను. నాసా వాళ్లు ప్రత్యేకంగా తయారుచేసిన మందులను నేను చైనా ప్రజలకు ఇచ్చాను. అయితే నేను తిరిగి భారత్ రావడానికి చైనా నుంచి విమానాలను రద్దు చేశారు. దాంతో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ద్వారా నేను భారత్ రావాలని అనుకుంటున్నాను. అంతేకాదు వచ్చేటప్పుడు కరోనా వైరస్‌ను ఓ డబ్బాలో నింపుకుని వస్తాను. ఇండియాలో ఉన్న రేపిస్ట్‌లకు, నిర్భయ నిందితులకు ఈ వైరస్ సోకేలా చేస్తాను. నేను ఏ డబ్బాలో అయితే కరోనా వైరస్‌ను నింపుకుని వచ్చానో ఆ డబ్బాను తీహార్ జైల్లోనే తెరుస్తాను. ఎందుకంటే వాళ్లకు ఉరి శిక్ష పడట్లేదు’’ అంటూ నోటికొచ్చిన చెత్తంతా వాగుతోంది రాఖీ.

READ ALSO: కొంపముంచిన ‘దర్బార్’.. పోలీసులను ఆశ్రయించిన మురుగదాస్

ఎవ్వరికీ హాని తలపెట్టకుండా, ఎవ్వరి జీవితాలతో ఆడుకోకుండా, మంచి పనులు చేస్తూ ఉంటే ఇలాంటి వైరస్ బారిన పడమని, ఒకప్పుడు చైనా వాళ్లు జీసెస్‌ని హిందూ దేవుళ్లను నోటికొచ్చినట్లు మాట్లాడారు కాబట్టే వారికి కరోనా వైరస్ సోకిందంటూ వీడియో పోస్ట్ చేసింది. కరోనావైరస్ కారణంగా చైనాలో ఉన్న భారతీయుల్ని ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముందు జాగ్రత్తగా వీరందర్నీ మనేసర్‌లోని క్వారంటైన్ సెంటర్లో అబ్జర్వేషన్లో ఉంచారు. వీరిలో ఐదుగురిలో దగ్గు, జలుబు లాంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఢిల్లీలోని ఆర్మీ బేస్ హాస్పిటల్‌కు తరలించారు.

View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on Feb 4, 2020 at 10:36pm PST

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.