యాప్నగరం

సల్మాన్ ఖాన్ సోదరులపై పోలీస్ కేసు.. రూల్స్ తమకేవీ పట్టవన్నట్లుగా వెళ్లడంతో!

సల్మాన్ ఖాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్‌లపై పోలీస్ కేసు నమోదైంది. కరోనా నిబంధనలను ఉల్లఘించినందుకు గాను వారిపై FIR నమోదు చేశారు.

Samayam Telugu 5 Jan 2021, 9:29 am
కరోనా వైరస్‌ని ఎలాగైనా అంతమొందించాలని ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నం చేస్తుంటే.. కొందరు మాత్రం ప్రభుత్వ నియమాలను, ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయడం లేదు. సాధారణ ప్రజలే గాక సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్లు కూడా ఈ లిస్టులో ఉండటం ఆశ్చర్యకరం. తాజాగా కొవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించడంతో బాలీవుడ్ సినీనటులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ పై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కేసు నమోదు చేసింది.
Samayam Telugu సల్మాన్ ఖాన్ సోదరులపై పోలీస్ కేసు.. రూల్స్ తమకేవీ పట్టవన్నట్లుగా వెళ్లడంతో!
Salman Khan Brothers


ప్రస్తుతం మన దేశంలో కరోనా ‘స్ట్రెయిన్’ కేసుల ఎఫెక్ట్ ఆందోళనకు గురిచేస్తున్న కారణంగా విదేశీ ప్రయాణీకులకు కొన్ని క్వారంటైన్ రూల్స్ అమలు చేస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్‌లు మాత్రం అవేవీ తమకు పట్టవన్నట్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ముంబై బీఎంసీ వైద్య అధికారులు వాళ్లపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు FIR నమోదు చేశారు.
స్పీడు పెంచిన హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ మూవీ హీరోయిన్ ఫిక్స్! బాలీవుడ్ బ్యూటీకి బంపర్ ఆఫర్
అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, నిర్వాన్ ఖాన్‌లు 2020 డిసెంబర్ 25న దుబాయ్ నుంచి ముంబైకు తిరిగి వచ్చారు. ఆ సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 14 రోజులపాటు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాలి. కానీ వారు ఆ రూల్స్ అతిక్రమిస్తూ నేరుగా ఇంటికి వెళ్లారని బీఎంసీ వైద్య అధికారి ఫిర్యాదు చేశారు. కొవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్‌లో ఉండాలని చెప్పినా వారు పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించారని వైద్య అధికారులు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.