యాప్నగరం

నేషనల్ డాక్టర్స్ డే: జెనీలియా కీలక నిర్ణయం.. భర్తతో కలిసి!!

జాతీయ వైద్యుల దినోత్సవం రోజున స్టార్ కపుల్ జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వీడియో మెసేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Samayam Telugu 1 Jul 2020, 8:37 pm
కరోనా వైరస్ భయానక పరిస్థితుల మధ్య యావత్తు భారతదేశం నేషనల్ డాక్టర్స్ డే (జాతీయ వైద్యుల దినోత్సవం)ను జూలై 1న జరుపుకుంటోంది. వైద్యుల సేవలకు గౌరవ సూచికంగా ఈ రోజును జరుపుకుంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సమాజం కోసం పనిచేస్తూ, రోగులకు సేవలందించే వైద్యులకు నీరాజనంగా ఈ రోజును నిర్వహిస్తారు. ఇలాంటి మంచి రోజున జెనీలియా దేశ్‌ముఖ్, రితేష్ దేశ్‌ముఖ్ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో జెనీలియా ఒక వీడియోను పోస్ట్ చేశారు.
Samayam Telugu జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్
Genelia Deshmukh, Riteish Deshmukh


Also Read: అనసూయ కోసం కష్టపడుతోన్న భరద్వాజ్.. భార్య కోసం ఇంటి భోజనం!

ఈ వీడియోలో జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ ఇద్దరూ కలిసి మాట్లాడారు. ‘‘దీని గురించి రితేష్, నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అమలు చేయలేకపోయాం. ఈరోజు డాక్టర్స్ డేను పురష్కరించుకుని మా అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ విషయంలో మాలో స్ఫూర్తినింపిన డాక్టర్ నోజర్ షెరీర్, FOGSIకి ధన్యవాదాలు. మరొకరికి జీవితాన్ని బహుమతిగా ఇవ్వడం కన్నా గొప్ప బహుమతి మరొకటి ఉండదు. ప్రతి ఒక్కరూ అవయవాలను దానం చేయాలని, జీవితాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని జెనీలియా, రితేష్ వెల్లడించారు.
View this post on Instagram @riteishd and me have been thinking about it for a long time but unfortunately didn’t get down to doing it. Today on Doctor’s Day we pledge to donate our organs. We want to thank Dr Nozer Sherier and FOGSI for inspiring us. The greatest gift you can give someone is ‘The gift of life’. .We urge you all to take a part in this initiate and pledge to save lives, pledge to donate your organs. A post shared by Genelia Deshmukh (@geneliad) on Jul 1, 2020 at 4:29am PDT
కాగా, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్థం నేషనల్ డాక్టర్స్‌ డేను నిర్వహిస్తున్నారు. 1882 జూలై 1న జన్మించిన చంద్ర రాయ్.. అదే రోజున 1962లో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారత అత్యుత్తమ పౌర పురస్కారం భారతరత్నను 1961 ఫిబ్రవరి 4న డాక్టర్ రాయ్ అందుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.