Indian Womens Cricket Team Captain Mithali Raj Biopic Is Confirmed Taapsee To Play The Reel Mithali
Mithali Raj బయోపిక్ కన్ఫర్మ్.. ఆ నటికే లక్కీ ఛాన్స్
మహిళా టీమిండియా కెప్టె్న్ మిథాలీ రాజ్ బయోపిక్ ఎట్టకేలకు కన్ఫర్మ్ అయిపోయింది. ప్రముఖ నటి తాప్సి మిథాలీ రాజ్ బయోపిక్లో నటించనున్నారు. ఈ సినిమాకు ‘శెభాష్ మిథు’ అనే టైటిల్ను కన్ఫర్మ్ చేశారు. ఈరోజు మిథాలీ 37వ బర్త్డే సందర్భంగా ఈ విషయాన్ని తాప్సి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
Samayam Telugu3 Dec 2019, 11:26 am
మహిళా టీమిండియా కెప్టె్న్ మిథాలీ రాజ్ బయోపిక్ ఎట్టకేలకు కన్ఫర్మ్ అయిపోయింది. ప్రముఖ నటి తాప్సి మిథాలీ రాజ్ బయోపిక్లో నటించనున్నారు. ఈ సినిమాకు ‘శెభాష్ మిథు’ అనే టైటిల్ను కన్ఫర్మ్ చేశారు. ఈరోజు మిథాలీ 37వ బర్త్డే సందర్భంగా ఈ విషయాన్ని తాప్సి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
నీకిదే నేనిచ్చే హామీ..
మిథాలీ రాజ్ బయోపిక్లో నటిస్తున్నానని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది తాప్సి. ‘హ్యాపీ బర్త్డే కెప్టెన్ మిథాలీ రాజ్. ఎన్నో విధాలుగా మమ్మల్ని గర్వపడేలా చేశావ్. నీ జీవిత ప్రయాణాన్ని తెరపై చూపించే అవకాశం నాకు వచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నాను. నీ పుట్టినరోజు సందర్భంగా ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు తెలీడంలేదు కానీ ఒక మాట ఇవ్వాలనుకుంటున్నాను. ఈ బయోపిక్లో నా రూపంలో నిన్ను నువ్వు చూసుకుని తప్పకుండా గర్వపడతావని మాత్రం చెప్పగలను. ఇక నేను కవర్ డ్రైవర్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు.
లక్కీ తాప్సి
తన కెరీర్లో ఎప్పుడూ వైవిధ్యమైన సినిమాలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తు్న్నారు తాప్సి. అందరు హీరోయిన్లు నటించే కాన్సెప్ట్స్ కాకుండా ఏదన్నా కొత్త ప్రయత్నించడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. అందుకే ‘నామ్ షబానా’, ‘బద్లా’, ‘సాండ్ కీ ఆంఖ్’, ‘మిషన్ మంగళ్’ వంటి చక్కటి కాన్సెప్ట్స్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఓ రకంగా ఈ సినిమాల్లో నటించడం వల్లే తాప్సి మిథాలీ రాజ్ బయోపిక్లో నటించే అవకాశం వచ్చింది అని చెప్పాలి. ఇకముందు మహిళా నేపథ్యంలో తెరకెక్కే బయోపిక్స్లో ఎవరినైనా తీసుకోవాలంటే ముందు తాప్సి పేరునే తలుచుకునేలా ఆమె తన సత్తాను చాటుకున్నారు.
వరుసగా మూడో బయోపిక్
వరుసగా మూడో బయోపిక్లో నటిస్తున్నారు తాప్సి. ఆమె నటించిన ‘సాండ్ కీ ఆంఖ్’ అనే సినిమా దీపావళికి విడుదలై మంచి విజయం అందుకుంది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన షూటర్స్ ప్రకాశీ తోమర్, చంద్రో తోమర్ల జీవితాధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ప్రకాశీ పాత్రలో తాప్సి నటించగా, చంద్రో పాత్రలో భూమి పెడ్నేకర్ నటించారు. ఈ సినిమా విడుదలకు ముందే తాప్సి ‘రాకెట్ రష్మి’ అనే మరో బయోపిక్కు సంతకం చేశారు. గుజరాత్కి చెందిన రష్మి అనే రన్నర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆ అమ్మాయి గుజరాత్ మొత్తంలో అందరికంటే వేగంగా పరిగెత్తగలదు. అందులో అంతా ఆమెను రాకెట్ అంటారు. ఆ యువతిపై ఈ బయోపిక్ రాబోతోంది. ఇందులో తాప్సి చాలా డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే ముచ్చటగా మూడో బయోపిక్కు తాప్సి సంతకం చేశారు. ఇక తాప్సికి బాలీవుడ్లో తిరుగేలేదు. అసలు నువ్వేంటి? నీ యాక్టింగ్ ఏంటి? అంటూ ఎగతాళి చేసిన వారికి తాప్సి ఈ సినిమాలతో నోరుమూయించబోతున్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.