దేశంలో వీరవిహారం చేస్తున్న కరోనా వైరస్ బచ్చన్ ఫ్యామిలీని తాకింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ శనివారం అర్ధరాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు.
''నాకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి వర్గాలు అధికారులకు సమాచారం అందించాయి. కుటుంబానికి, స్టాఫ్కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్టుల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. గత 10 రోజులుగా నాతో దగ్గరగా మెలిగిన వారు ఎవరికి వారుగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను.’’ అని బిగ్ బి ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే అమితాబ్ కుటుంబ సభ్యులైన జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే వీళ్ళిద్దరికీ కరోనా నెగెటివ్ అని వచ్చిందని ఆదివారం ఉదయం మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.
అమితాబ్, అభిషేక్ బచ్చన్లకు తప్ప వారి కుటుంబ సభ్యులెవరికీ కరోనావైరస్ సోకలేదని ఆయన అన్నారు. దీంతో బాలీవుడ్ సినీ లోకం కాస్త ఊపిరి పీల్చుకుంది.
ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ ఇద్దరూ ముంబై లోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్ళిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెప్పారు. వీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు సెలబ్రిటీలు ట్వీట్స్ పెడుతున్నారు.
''నాకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి వర్గాలు అధికారులకు సమాచారం అందించాయి. కుటుంబానికి, స్టాఫ్కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్టుల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. గత 10 రోజులుగా నాతో దగ్గరగా మెలిగిన వారు ఎవరికి వారుగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను.’’ అని బిగ్ బి ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే అమితాబ్ కుటుంబ సభ్యులైన జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే వీళ్ళిద్దరికీ కరోనా నెగెటివ్ అని వచ్చిందని ఆదివారం ఉదయం మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.
అమితాబ్, అభిషేక్ బచ్చన్లకు తప్ప వారి కుటుంబ సభ్యులెవరికీ కరోనావైరస్ సోకలేదని ఆయన అన్నారు. దీంతో బాలీవుడ్ సినీ లోకం కాస్త ఊపిరి పీల్చుకుంది.
ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ ఇద్దరూ ముంబై లోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్ళిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెప్పారు. వీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు సెలబ్రిటీలు ట్వీట్స్ పెడుతున్నారు.