2014లో రిలీజైన ‘ఫగ్లీ’ మూవీతో బాలీవుడ్కు పరిచయమైన కియారా అద్వానీ (Kiara Advani) ఆ తర్వాత ఎంఎస్ ధోని బయోపిక్ చిత్రం ద్వారా గుర్తింపు సాధించింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయమైంది. ఇక హిందీలో ఆమె చేసిన ‘లస్ట్ స్టోరీస్’తో ఇండస్ట్రీని షేక్ చేసింది. అన్నింటి కంటే మించి విజయ్ దేవరకొండ తెలుగు మూవీ ‘అర్జున్ రెడ్డి’కి హిందీ రీమేక్గా తెరకెక్కిన ‘కబీర్ సింగ్’ మూవీతో బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం కియారా ‘గోవింద నామ్ మేరా’(Govinda Naam Mera) చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే సదరు డైరెక్టర్ శశాంక్ ఖైతాన్(Shashank Khaitan)తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసింది. తనను తాను దర్శకుల నటిగా పేర్కొన్న కియారా.. ‘గోవింద నామ్ మేరా’ సినిమా కోసం డైరెక్టర్ శశాంక్ ఖైతాన్ విజన్కు తాను పూర్తిగా సరెండర్ అయినట్లు తెలిపింది. ఒక నటిగా ఎప్పుడూ కూడా దర్శకుడి విజన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది. సినిమా దర్శకుడి కోణంలోనే తెరకెక్కుతుంది కాబట్టి వారితో సింక్రనైజ్ కావాలని అభిప్రాయపడింది.
ఇక కియారా ఈ ఏడాది నటించిన ‘భూల్ భూలయ్యా 2, జగ్జగ్ జీయో’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. కాగా తాము సినిమాలను తమ కోసం కాకుండా ప్రేక్షకుల కోసం నిర్మిస్తున్నామని.. వారు తమ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటున్నామని తెలిపింది. ఒక సినిమాకు రిపీట్ వాల్యూ ఉంటే అదేత తమకు అతిపెద్ద బహుమతి అని స్పష్టం చేసింది.
మీడియంతో సంబంధం లేకుండా ప్రతి చిత్రం విడుదలకు ముందు తాను భయపడుతుంటానని కియారా తెలిపింది. అది థియేట్రికల్ లేదా డిజిటల్ రిలీజ్ అయినా సరే ట్రైలర్ రిలీజ్ చేసేటప్పుడు కూడా జనాలకు నచ్చుతుందా లేదా అనే విషయంలో చిన్నపాటి కంగారు ఉంటుందని చెప్పింది. అలాగే ఈ మూవీ టీమ్తో షూటింగ్ ఎంత అద్భుతంగా జరిగిందో ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది.
కియారా అద్వానీ అప్కమింగ్ సినిమాల విషయానికొస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు జోడీగా ఎస్ శంకర్ దర్శకత్వంలో తెలుగు చిత్రంలో పనిచేస్తోంది. చెర్రీతో గతంలో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో చేసింది. దీని తర్వాత రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సత్యప్రేమ్ కి కథ’లో కార్తీక్ ఆర్యన్కు జంటగా కనిపించనుంది. మొత్తానికి బాలీవుడ్తో పాటు సౌత్లోనూ డిమాండ్ ఉన్న హీరోయిన్గా కొనసాగుతోంది.
Read Latest Telugu Movies News , Telugu News
ఇక కియారా ఈ ఏడాది నటించిన ‘భూల్ భూలయ్యా 2, జగ్జగ్ జీయో’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. కాగా తాము సినిమాలను తమ కోసం కాకుండా ప్రేక్షకుల కోసం నిర్మిస్తున్నామని.. వారు తమ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటున్నామని తెలిపింది. ఒక సినిమాకు రిపీట్ వాల్యూ ఉంటే అదేత తమకు అతిపెద్ద బహుమతి అని స్పష్టం చేసింది.
మీడియంతో సంబంధం లేకుండా ప్రతి చిత్రం విడుదలకు ముందు తాను భయపడుతుంటానని కియారా తెలిపింది. అది థియేట్రికల్ లేదా డిజిటల్ రిలీజ్ అయినా సరే ట్రైలర్ రిలీజ్ చేసేటప్పుడు కూడా జనాలకు నచ్చుతుందా లేదా అనే విషయంలో చిన్నపాటి కంగారు ఉంటుందని చెప్పింది. అలాగే ఈ మూవీ టీమ్తో షూటింగ్ ఎంత అద్భుతంగా జరిగిందో ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది.
కియారా అద్వానీ అప్కమింగ్ సినిమాల విషయానికొస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు జోడీగా ఎస్ శంకర్ దర్శకత్వంలో తెలుగు చిత్రంలో పనిచేస్తోంది. చెర్రీతో గతంలో ‘వినయ విధేయ రామ’ చిత్రంలో చేసింది. దీని తర్వాత రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సత్యప్రేమ్ కి కథ’లో కార్తీక్ ఆర్యన్కు జంటగా కనిపించనుంది. మొత్తానికి బాలీవుడ్తో పాటు సౌత్లోనూ డిమాండ్ ఉన్న హీరోయిన్గా కొనసాగుతోంది.
Read Latest Telugu Movies News , Telugu News