యాప్నగరం

షారుఖ్ సాయం.. థ్యాంక్స్ చెప్పిన మహారాష్ట్ర మంత్రి

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతోన్న వైద్య సిబ్బంది కోసం 25వేల పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్‌మెంట్ కిట్స్‌ను షారుఖ్ అందజేశారు.

Samayam Telugu 14 Apr 2020, 8:36 pm
కరోనా వైరస్‌ను దేశం నుంచి తరిమికొట్టడానికి జరుగుతోన్న పోరాటానికి తనవంతు సహకారాన్ని అందిస్తానని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం వైద్య సిబ్బంది కోసం 25వేల పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్‌మెంట్ (PPE)లను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. అయితే, ఈ విషయాన్ని షారుఖ్ స్వయంగా ప్రకటించలేదు. మహారాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి రాజేష్ తోపే ట్వీట్ చేయడం వల్ల తెలిసింది. షారుఖ్ ఖాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి షారుఖ్ కూడా స్పందించారు.
Samayam Telugu Shah_Rukh_Khan
షారుఖ్ ఖాన్


‘‘25వేల పీపీఈ కిట్స్ విరాళంగా అందజేసిన షారుఖ్ ఖాన్‌కు కృతజ్ఞతలు. కోవిడ్-19పై మేం చేస్తోన్న పోరాటానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. ముందు వరుసలో ఉండి పోరాడుతోన్న మన వైద్య సిబ్బందిని సురక్షితంగా ఉంచుతుంది’’ అని రాజేష్ తోపే తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు షారుఖ్ కూడా స్పందించారు. మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ కిట్స్‌‌ను కొనుగోలు చేయడానికి అన్ని విధాలుగా సహకరించినందుకు థాంక్యూ సార్. మనల్ని, మానవాళిని కాపాడుకునే ఈ ప్రయత్నంలో మనందరం ఒక్కటవ్వాలి. ఈ విధంగా సహాయం చేయగలిగినందుకు ఆనందంగా ఉంది. మీరు, మీ కుటుంబాలు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.