యాప్నగరం

Mahesh Bhatt: సుశాంత్ ఆత్మహత్యపై కొనసాగుతున్న సస్పెన్స్.. విచారణకు మహేశ్​ భట్

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సుశాంత్ ఆత్మహత్యకు పలువురు ప్రముఖులే కారణమంటూ వస్తున్న ఆరోపణలపై దృష్టి సారించారు ముంబై పోలీసులు.

Samayam Telugu 27 Jul 2020, 9:29 am
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌ని షేక్ చేసింది. ఎంతో టాలెంట్‌, మంచి భవిష్యత్ ఉన్న ఆ యువనటుడు బలవన్మరణానికి పాల్పడేంత పిరికివాడు కాదని పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తుండటంతో ముంబై పోలీసులు ఈ సూసైడ్ కేసు విచారణ వేగ‌వంతం చేశారు. ఈ క్రమంలోనే డైరెక్ట‌ర్ సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, సినిమా క్రిటిక్ రాజీవ్ మసంద్, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సహా ఇప్పటి వరకు 37 మందిని విచారించారు. ఇక ఇప్పుడు ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాత మ‌హేశ్ భట్ వాంగ్మూలాన్ని కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Samayam Telugu సుశాంత్ ఆత్మహత్యపై కొనసాగుతున్న సస్పెన్స్.. విచారణకు మహేశ్_ భట్
Mahesh Bhatt


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విషయమై మరో రెండు రోజుల్లో మ‌హేశ్ భట్‌ని కూడా పోలీసులు విచారించనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్ల‌డించారు. ఆయనతో పాటు కరణ్ జోహర్ మేనేజర్నూ విచారణకు పిలిచినట్లు ఆయన తెలిపారు. మరోవైపు సుశాంత్ మ‌ర‌ణంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తోన్న‌ నటి కంగనా రనౌత్కూ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: సీఎం కొడుక్కి బెస్ట్ ఫ్రెండనా.. కరణ్ జోహార్‌కు పోలీసులు సమన్లు ఇవ్వకపోవడంపై కంగనా ఫైర్

గత నెల 14న తన ఇంట్లోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇది ఆత్మహత్య కాదు హత్య అని సుశాంత్ సన్నిహిత వర్గాలు ఆరోపించినప్పటికీ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆత్మహత్య అని తేలడంతో.. ఎంతో కెరీర్ ఉన్న అతను ఇలా సూసైడ్ చేసుకోవడానికి కారణాలేంటి? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మిస్టరీ చెందించే దిశగా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.