యాప్నగరం

నడుం పట్టుకోవాలని చూశాడు వేలు విరిచేసా: తాప్సి

నడుం పట్టుకోవాలని చూసిన ఆకతాయికి బుద్ధిచెప్పానని అంటున్నారు సినీ నటి తాప్సి. పవిత్రమైన క్ష్రేత్రంలో తన నడుం పట్టుకోవాలని చూశాడని తెలిపారు.

Samayam Telugu 30 Jan 2020, 10:29 am
సినీ నటి తాప్సికి ఓ ఆకతాయి నుంచి చేదు అనుభవం ఎదురైందట. పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి ఆకతాయి చేష్టలు సర్వ సాధారణమే. కానీ తాప్సికి మాత్రం పవిత్రమైన పుణ్యస్థలంలో వేధింపులు ఎదురయ్యాయట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Samayam Telugu taapsee pannu
తాప్సి


‘‘గురునానక్ జయంతి రోజున నేను ఫ్యామిలీతో కలిసి కచ్చితంగా గురుద్వారకు వెళ్తాను. గతేడాది కూడా వెళ్లాను. అక్కడ భక్తులకు భోజనాలు వడ్డిస్తుంటాం. ఆ సమయంలో ఇసుకేస్తే రాలనంత జనం వస్తాను. దాంతో ఒకర్నొకరు ఢీకొట్టుకుంటూ ఉంటారు. ఓసారి నాకు చేదు అనుభవం ఎదురైంది. నేను ఆ గుంపులో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ ఆకతాయి నా నడుం పట్టుకోవాలని చూశాడు. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. ఎలా బుద్ధిచెప్పాలో ముందే ఆలోచించి పెట్టుకున్నాను. అతని వేలు పట్టుకుని విరిచేశాను. దాంతో వాడు విలవిలలాడుతూ పక్కకు వెళ్లిపోయాడు. నేను కూడా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాను’ అని తెలిపారు.

READ ALSO: Coronavirus Effect: ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ లియోనీ

ప్రస్తుతం తాప్సి చేతిలో చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్. టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో తాప్సి నటిస్తున్నారు. నిన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. మిథాలీగా తాప్సి చాలా బాగా కనిపించారు. దీంతో పాటు ఆమె ‘తప్పడ్’, ‘రాకెట్ రష్మి’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. మంచి మెసేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో తాప్సి ఒకరు. ఆమె సినిమా రంగానికి చేస్తున్న సేవకు గానూ త్వరలో పద్మశ్రీ అందుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.

READ ALSO: ‘‘తారక్‌ను మూడు గెటప్స్‌లో చూశాను, ఫ్యాన్స్‌కి పండగే’’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.